ఎమ్మార్ పాపర్టీస్ కేసులో అరెస్ట్ అయిన సునీల్ రెడ్డిని ఏడు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ దాఖలు చేసిన పిటీషన్ ని నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఫిబ్రవరి 1వ తేదీ వరకు సునీల్ రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్ ని పొడిగించారు.
సునీల్ విషయంలో ఇప్పటికే సరైన ఆధారాలు సమర్పించలేదని, ఎలాంటి గ్రౌండ్స్ లేకుండా మళ్లీ కస్టడీకి అడుగుతున్నారని డిఫెన్స్ లాయర్ సుశీల్ అభ్యంతరం తెలిపారు. ఈ కేసులో సిబిఐ చట్టప్రకారం వ్యవహరించడంలేదని, ఇప్పటికే చాలా సార్లు సునీల్రెడ్డిని ప్రశ్నించారని సుశీల్ తెలిపారు. కేవలం వేధించడానికే సిబిఐ కస్టడీకి అడుగుతోందని తెలిపారు. దీనిపై సిబిఐ వాదన కూడా అంత బలంగా లేకపోవడంతో కోర్టు డిఫెన్స్ వాదననే సమర్థించింది. సిబిఐ విజ్ఞప్తిని కొట్టివేసింది. సునీల్ రెడ్డికి ఎల్లుండి వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైల్కు తరలించారు.
సునీల్ విషయంలో ఇప్పటికే సరైన ఆధారాలు సమర్పించలేదని, ఎలాంటి గ్రౌండ్స్ లేకుండా మళ్లీ కస్టడీకి అడుగుతున్నారని డిఫెన్స్ లాయర్ సుశీల్ అభ్యంతరం తెలిపారు. ఈ కేసులో సిబిఐ చట్టప్రకారం వ్యవహరించడంలేదని, ఇప్పటికే చాలా సార్లు సునీల్రెడ్డిని ప్రశ్నించారని సుశీల్ తెలిపారు. కేవలం వేధించడానికే సిబిఐ కస్టడీకి అడుగుతోందని తెలిపారు. దీనిపై సిబిఐ వాదన కూడా అంత బలంగా లేకపోవడంతో కోర్టు డిఫెన్స్ వాదననే సమర్థించింది. సిబిఐ విజ్ఞప్తిని కొట్టివేసింది. సునీల్ రెడ్డికి ఎల్లుండి వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైల్కు తరలించారు.
0 comments:
Post a Comment