జగన్ వెంట జనం: ఎంపి రాయపాటి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ వెంట జనం: ఎంపి రాయపాటి

జగన్ వెంట జనం: ఎంపి రాయపాటి

Written By ysrcongress on Saturday, January 21, 2012 | 1/21/2012

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ప్రజాదరణ గల నాయకుడన్న మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి వ్యాఖ్యలతో తాను పూర్తీగా ఏకీభవిస్తున్నట్లు ఎంపి రాయపాటి సాంబశివరావు చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వంద శాతం వాస్తవం అన్నారు. కనపడుతుంది గదా, జగన్ వెంట జనం వస్తున్నారు అని అన్నారు. 

కమ్మవారిని టాయిలెట్ పేపర్ లాగా వాడుకొని పారవేస్తున్నారని బాధపడ్డారు. మంత్రి వర్గ విస్తరణలో ముఖ్యమంత్రికి మరింత స్వేచ్చ ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు. మంత్రి పదవులు తీసుకున్నవారు రానున్న ఎన్నికలలో అభ్యర్థులను గెలిపించవలసిన బాధ్యత తీసుకోవాలన్నారు. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత తగ్గిస్తున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తేనే ఎన్నికలలో పార్టీ గెలవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు.
Share this article :

0 comments: