‘మైలవరం బాధితులకు జగన్ ఆర్ధిక సహాయం’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘మైలవరం బాధితులకు జగన్ ఆర్ధిక సహాయం’

‘మైలవరం బాధితులకు జగన్ ఆర్ధిక సహాయం’

Written By ysrcongress on Sunday, January 1, 2012 | 1/01/2012

మైలవరం కల్తీ సారా దుర్ఘటనపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి స్పందించారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మైలవరం కల్తీ సారా బాధితుల్ని ఆదుకుంటామని జిల్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సామినేని ఉదయభాను వెల్లడించారు. నాటు సారా కాటుకు కృష్ణా జిల్లా మైలవరం మండలంలో 17 మంది మృత్యువాత పడ్డారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
Share this article :

0 comments: