ఏదో ఒక కేసులో జగన్ ని ఇరికించే యత్నం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏదో ఒక కేసులో జగన్ ని ఇరికించే యత్నం

ఏదో ఒక కేసులో జగన్ ని ఇరికించే యత్నం

Written By ysrcongress on Tuesday, January 24, 2012 | 1/24/2012

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని ఈ ప్రభుత్వం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, సిబిఐ కలిసి ఏదో ఒక కేసులో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆ పార్టీ అధికా ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ భూముల విషయంలో కోనేరు ప్రసాద్ తో అసలు కథనడిపించింది చంద్రబాబు నాయుడని ఆమె తెలిపారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థకు తక్కువ ధరకు భూములు ఇచ్చిన చంద్రబాబుని విచారించకుండా, ఆ వ్యవహారంతో ఏమీ సంబంధంలేని జగన్ ని విచారించడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. 

జగన్మోహన రెడ్డిని తొలుత ఓబులాపురం మైనింగ్ కేసులో ఇరికించాలని చూశారు. అక్కడ సాధ్యం కాలేదు. ఆ తరువాత ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో ప్రయత్నించారు. అక్కడా సాధ్యంకాలేదు. ఇప్పుడు ఆయన సన్నిహితులను కూడా ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. జగన్మోహన రెడ్డికి సన్నిహితంగా ఉండే సునీల్ రెడ్డిని ఏ కేసుకు సంబంధించి విచారిస్తున్నారో కూడా అర్ధం కాని పరిస్థితి అన్నారు. 

సిబిఐ చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై వ్యవహరిస్తోందని అందరికీ అర్ధమవుతోందన్నారు.
Share this article :

0 comments: