క్రోసూరు నుంచి వైఎస్ జగన్ ఓదార్పు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » క్రోసూరు నుంచి వైఎస్ జగన్ ఓదార్పు

క్రోసూరు నుంచి వైఎస్ జగన్ ఓదార్పు

Written By ysrcongress on Friday, January 20, 2012 | 1/20/2012

గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర ప్రజల ప్రేమ, ఆదరణ మధ్య విజయవంతంగా కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం క్రోసూరు నుంచి వైఎస్ జగన్ ఓదార్పు యాత్రను ప్రారంభించారు. పెదపాలెంలో చిలకా మరియమ్మ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. కొండూరులో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

దొడ్లేరులో రెండు విగ్రహాల ఆవిష్కరణ, ఆవులవారిపాలెంలో ద్రోణాదుల శ్రీనివాసరావు కుటుంబానికి ఓదార్పు, హస్సానాబాద్‌లో విగ్రహావిష్కరణ, షేక్ గారపాటి గాలిసా కుటుంబానికి ఓదార్పు, గుడిపాడులో నాలుగు విగ్రహాలను జగన్ ఆవిష్కరించనున్నారు.ఓదార్పుయాత్రలో భాగంగా వైఎస్ జగన్‌ శుక్రవారం ఉదయం అచ్చంపేట మండలం పెదపాలెంలో మహానేత మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన చిలకా మరియమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మంచాన పడ్డ మరియమ్మ మరణించింది. ఆమెకు ముగ్గురు కుమారులు. వీరంతా కూలిపనులతోనే జీవనం సాగిస్తున్నారు. మరియమ్మ కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన జగన్ వారికి అన్నివిధాల అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
Share this article :

0 comments: