సర్చార్జిల రూపంలో ప్రజల నడ్డి విరించేందుకు ప్రయత్నించిన రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి హైకోర్టు గట్టి షాకిచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. గతంలో సింగిల్ జడ్డి ఇచ్చిన ఉత్తర్వులను తప్పుపట్టింది. లక్షలాది మంది గృహ వినియోగదారులకు ఊరట నిచ్చేలా హైకోర్టు తీర్పు నిచ్చింది. సుమారు మూడు వేల కోట్ల రూపాయలను సర్చార్జీల రూపంలో వసూలు చేసేందుకు ఏపీఈఆర్సీ ఇచ్చిన సడలింపులను తీవ్రంగా తప్పుపట్టింది. ఈ విషయంలో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి హద్దులు దాటిందని ఆక్షేపించింది. మూడేళ్ల కింది సర్చార్జిలను ఇప్పుడెలా వసూలు చేస్తారంటూ ప్రశ్నించింది. సర్చార్జీల పేరుతో పెట్టిన ప్రతిపాదనకు ఏ మాత్రం పారదర్వకత లేదని ఆభిప్రాయపడింది.
Home »
» రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు షాక్
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు షాక్
Written By ysrcongress on Friday, January 20, 2012 | 1/20/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment