తండ్రి చావుకు కారణమైన దుర్మార్గుడివంటూ నిలదియ్యాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తండ్రి చావుకు కారణమైన దుర్మార్గుడివంటూ నిలదియ్యాలి

తండ్రి చావుకు కారణమైన దుర్మార్గుడివంటూ నిలదియ్యాలి

Written By ysrcongress on Tuesday, January 24, 2012 | 1/24/2012

* తండ్రి చావుకు కారణమైన దుర్మార్గుడివంటూ నిలదియ్యాలి
* అవసరానికి సొంత మనుషులనూ తాకట్టు పెట్టడం బాబు నైజం
* జూనియర్ ఎన్టీఆర్‌లా బాలయ్యనూ వాడుకుని వదిలేస్తాడు
* ఎన్టీఆర్‌కు సినీ అవకాశాలు రానివ్వకుండా కెరీర్‌ను నాశనం చేస్తున్నాడు

హైదరాబాద్, న్యూస్‌లైన్: సినీ నటుడు నందమూరి బాలకృష్ణపై దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన చంద్రబాబు వంటి దుర్మార్గునికి మద్దతిస్తావా? తెలుగుజాతి పౌరుషాన్ని ఢిల్లీలో చాటిచెప్పిన మహానుభావుడు ఎన్టీఆరైతే.. అవినీతి కేసులు, సీబీఐ దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీ కాళ్లు పట్టుకున్న నయవంచకుడు బాబు. అవినీతికి మారుపేరైన వ్యక్తిని అందలమెక్కించాలంటావా? నీ తండ్రి చావుకు కారణమైన బాబుకు మద్దతివ్వాలా? నీకు రోషం, పౌరుషం లేవా? నువ్వు ఎన్టీఆర్‌కు పుట్టిన కొడుకువేనా? ఎన్టీఆర్‌కు ఇలాంటి సంతానం కలగడం చాలా బాధగా ఉంది’’ అంటూ ధ్వజమెత్తారు. 

టీడీపీ ప్రతిష్టను దిగజార్చిన బాబును భుజాన మోసే బానిస బతుకు బాలయ్యదని దుయ్యబట్టారు. కుట్రలు, కుతంత్రాలతో నందమూరి వంశాన్ని బాబు తన బానిసలుగా మార్చుకున్నారని విమర్శించారు. సోమవారం ఆమె తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘బాలయ్యా.. ప్రజల్లో తొడలు కొట్టడం కాదు. నీ బావ చంద్రబాబు ఇంటి ముందుకెళ్లి తొడగొట్టి మీసం తిప్పు. నీ తండ్రి చావుకు కారణమైన దుర్మార్గుడు బాబేనంటూ నిలదీస్తే తెలుగు ప్రజలు మెచ్చుకుంటారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి వేలకోట్ల ఆస్తులు ఎలా కూడబెట్టావని బాబును ప్రశ్నించు. అప్పుడే నువ్వు నిజమైన హీరో అవుతావు’’ అని పేర్కొన్నారు. బాబు నక్కజిత్తుల రాజకీయ ఆలోచనలకు బాలకృష్ణ మడుగులొత్తడం దురదృష్టకరమన్నారు.

కరివేపాకులా నందమూరి వంశం
ప్రజల్లో విశ్వసనీయతలేని బాబు.. అధికారం కోసం నందమూరి వంశాన్ని కరివేపాకులా వాడుకుంటున్నారని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. ‘పూటకొక మాట, వేషంతో బాబు బఫూన్‌లా మారారు. అవినీతికి వ్యతిరేకమంటూ అన్నా హజారే ఫొటోలతో ఉద్యమాలు చేస్తూ, తన అవినీతి కేసుల్లో మాత్రం కోర్టులకెళ్లి స్టేలు తెచ్చుకోవడం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనం. బాబు చెప్పే మాటలకు చేతలకు పొంతనే ఉండదు. తొమ్మిదేళ్ల పాటు రైతులను అనేక హింసలకు గురిచేసి, ఇప్పుడు రైతు పోరు యాత్రలంటూ తలకు రుమాలు కడుతున్నారు. రైతులు, అణగారిన వర్గాలు ఆయన్ను ఈ జన్మలో నమ్మరు. అందుకు బాబు ప్రజలకు ముఖం చూపించలేక నందమూరి వంశాన్ని కరివేపాకులా ఉపయోగించుకుంటున్నారు. అందులో భాగంగానే 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకున్నారు. అవసరం తీరాక పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఆయనకు సినిమా అవకాశాలు కూడా దక్కకుండా చేసి, కెరీర్‌ను పాడు చేస్తున్నారు. గతంలో హరికృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావులను కూడా ఇలాగే వాడుకున్నారు. పదవి కోసం సొంత మనుషులను తాకట్టు పెట్టే నీచ సంస్కృతి బాబుది. పదవీ వ్యామోహంతో, బాలయ్యను తన వైపు తిప్పుకునేందుకే కొడుకు లోకేశ్‌కు ఆయన కూతురితో పెళ్లి చేశారు’’ అంటూ ఆమె దుయ్యబట్టారు. 

సొంత తమ్ముడు రామ్మూర్తి నాయుడిని కూడా బాబు కోలుకోలేని దెబ్బతీశారన్నారు. ‘‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దయ చూపకపోయింటే బాలయ్య జైల్లో ఊచలు లెక్కపెట్టేవారు. జీవితాంతం ఖైదీగా ఉండేవారు. బెల్లంకొండ సురేశ్‌పై హత్యాయత్నం చేసిన కేసులో వైఎస్ జోక్యం చేసుకోకుంటే నీవెక్కడుండే వాడివి బాలయ్యా? జీవితాన్ని ప్రసాదించిన వ్యక్తులను విమర్శించడానికి నోరెలా వచ్చింది? వైఎస్‌ను విమర్శిస్తే పుట్టగతులుండవు’’ అని లక్ష్మీపార్వతి దుయ్యట్టారు. వైఎస్ స్థానంలో బాబు ఉండుంటే బాలయ్యను కటకటాలపాలు చేసి, అడ్డు తొలగించుకునేవారన్నారు. బాబులాంటి నీచ బుద్ధి గల వ్యక్తుల కింద పని చేస్తానని బాలకృష్ణ చెప్పుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.
Share this article :

0 comments: