ఆవులవారిపాలెం:గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న ఓదార్పుయాత్రలో భాగంగా ఆవులవారిపాలెంలోని ద్రోణాదుల శ్రీనివాసరావు కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి పరామర్శించారు.
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే అంతులేని అభిమానాన్నిశ్రీనివాసరావు చూపించేవారు. వైఎస్ ఆకస్మిక మరణాన్ని టెలివిజన్లో చూసి తట్టుకోలేక .. అలాగే గోడకు చేరబడి... ప్రాణాలు వదిలారు. దాంతో నిరుపేద శ్రీనివాసరావు కుటుంబం కష్టాల్లోకి జారుకుంది.
కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని వైఎస్ జగన్ శుక్రవారం మధ్యాహ్నం పరామర్శించారు. కుటుంబ కష్టసుఖాల్ని విచారించారు. తనను కూడా ఆ ఇంటి బిడ్డగానే భావించమంటూ.. ఆ ఇంటి ఇల్లాలికి కొండంత భరోసానందించారు. తన తండ్రి కోసం ప్రాణాలు వదిలిని శ్రీనివాసరావుని అభిమానిగా అనుకోవడం లేదని.. సొంత మనిషిగా భావిస్తున్నానని జగన్ అన్నారు. ఎలాంటి సహాయానికైనా తానున్నానన్న సంగతి మరవకూడదని జగన్ గుర్తు చేశారు.
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే అంతులేని అభిమానాన్నిశ్రీనివాసరావు చూపించేవారు. వైఎస్ ఆకస్మిక మరణాన్ని టెలివిజన్లో చూసి తట్టుకోలేక .. అలాగే గోడకు చేరబడి... ప్రాణాలు వదిలారు. దాంతో నిరుపేద శ్రీనివాసరావు కుటుంబం కష్టాల్లోకి జారుకుంది.
కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని వైఎస్ జగన్ శుక్రవారం మధ్యాహ్నం పరామర్శించారు. కుటుంబ కష్టసుఖాల్ని విచారించారు. తనను కూడా ఆ ఇంటి బిడ్డగానే భావించమంటూ.. ఆ ఇంటి ఇల్లాలికి కొండంత భరోసానందించారు. తన తండ్రి కోసం ప్రాణాలు వదిలిని శ్రీనివాసరావుని అభిమానిగా అనుకోవడం లేదని.. సొంత మనిషిగా భావిస్తున్నానని జగన్ అన్నారు. ఎలాంటి సహాయానికైనా తానున్నానన్న సంగతి మరవకూడదని జగన్ గుర్తు చేశారు.
0 comments:
Post a Comment