రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజల జీవితాలతో ఆడుకుంటోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాజిరెడ్డి మాట్లాడుతూ... విద్యుత్ ఛార్జీలు పెంచడం పూర్తిగా విశ్వాస ఘాతకం అని అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించకపోతే.. ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు. విద్యుత్ నియంత్రణ మండలికి వ్యతిరేకంగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు.
Home »
» ఛార్జీలు పెంచడం విశ్వాస ఘాతకం: బాజిరెడ్డి
ఛార్జీలు పెంచడం విశ్వాస ఘాతకం: బాజిరెడ్డి
Written By ysrcongress on Wednesday, January 18, 2012 | 1/18/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment