దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాసిరెడ్డి పద్మ విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి మాట్లాడుతూ.. కేవలం అక్కసుతోనే వైఎస్ఆర్ విగ్రహాలను కూలగొడతామని బాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ విగ్రహాల ఆవిష్కరణపై తెలుగుదేశం శ్రేణులు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వాసిరెడ్డి అన్నారు. ప్రజలు స్వచ్చందంగా మహానేత విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటున్నారని పద్మ తెలిపారు. విగ్రహాల జోలికి వస్తే ఏమి జరుగుతుందో చంద్రబాబుకు తెలుస్తుందన్నారు.
Home »
» విగ్రహాల జోలికి వస్తే ఏమి జరుగుతుందో తెలుస్తుంది
విగ్రహాల జోలికి వస్తే ఏమి జరుగుతుందో తెలుస్తుంది
Written By ysrcongress on Thursday, January 19, 2012 | 1/19/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment