కాకినాడ, న్యూస్లైన్ ప్రతినిధి: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత తోట గోపాలకృష్ణ మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తన తండ్రి వైఎస్తో కలిసి ఉన్నప్పుడు తనను ఎంతో ఆప్యాయతతో పలకరించే నేత లేరనే నిజాన్ని నమ్మలేకపోతున్నానని ఆవేదన వ్యక్తంచేశారు. గోపాలకృష్ణ హైదరాబాద్లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందిన సంగతి తెలిసిందే.
ఆయన అంత్యక్రియలు స్వగ్రామమైన తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో శుక్రవారం జరిగాయి. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో ఉన్న జగన్మోహన్రెడ్డికి ఈ విషయం తెలిసి శుక్రవారం మధ్యాహ్నం కిర్లంపూడి వచ్చారు. గోపాలకృష్ణ భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. జగన్ను చూడగానే గోపాలకృష్ణ కుమారుడు సుబ్బారావునాయుడు కన్నీరు పెట్టుకున్నారు. జగన్ ఆయన భుజం తట్టి ఓదార్చారు.
అనంతరం జగన్.. గోపాలకృష్ణ భార్య అచ్యుతామణి, తల్లి వీరరాఘవమ్మ, కుమార్తె మంగాదేవిలను పరామర్శించారు. ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్వించే అన్న గోపాలకృష్ణకు ఇలా జరుగుతుందని ఊహించలేకపోయానని జగన్ విచారం వ్యక్తం చేశారు. పెద్దాయన మరణం తనను కలచివేస్తోందని, మీ కుటుంబానికి పెద్ద బిడ్డగా ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటానని అచ్యుతామణికి ధైర్యం చెప్పారు. గోపాలకృష్ణ ఆస్పత్రికి వెళ్లే ముందు కూడా తనను కలిసి ప్రజాబలం మనవైపే ఉందని ధైర్యం చెప్పిన విషయాన్ని జగన్ గుర్తుతెచ్చుకున్నారు. అనంతరం సామర్లకోట, రాజమండ్రి మీదుగా గుంటూరు వెళ్లారు.
‘తోట’కు తుది వీడ్కోలు
గోపాలకృష్ణ భౌతిక కాయాన్ని కడసారి చూసి నివాళులర్పించేందుకు జిల్లా నలుమూలల నుంచి నేతలు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కిర్లంపూడి వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. మంత్రి తోట నరసింహం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా పరిశీలకుడు తోట నవీన్ గోపాలకృష్ణ భౌతికకాయం ఉన్న పాడెను మోశారు. మధ్యాహ్నం స్థానిక కుమ్మరివీధిలో ఉన్న శ్మశానవాటికలో సుబ్బారావునాయుడు.. తన తండ్రి చితికి నిప్పంటించారు. గోపాలకృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ఎంపీలు ఉండవల్లి అరుణ్కుమార్, జీవీ హర్షకుమార్, ఎమ్మెల్యేలు పిల్లి సుభాష్ చంద్రబోస్, గొల్ల బాబూరావు, వంగా గీత, పంతం గాంధీమోహన్, రౌతు సూర్యప్రకాశరావు తదితరులున్నారు.
సీఎం, బొత్స సంతాపం..
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తోట కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించారు. హైదరాబాద్ నుంచి ఫోన్లో గోపాలకృష్ణ కుమారుడు సుబ్బారావునాయుడిని పరామర్శించి కుటుంబానికి సంతాపం తెలిపారు.
ఆయన అంత్యక్రియలు స్వగ్రామమైన తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో శుక్రవారం జరిగాయి. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో ఉన్న జగన్మోహన్రెడ్డికి ఈ విషయం తెలిసి శుక్రవారం మధ్యాహ్నం కిర్లంపూడి వచ్చారు. గోపాలకృష్ణ భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. జగన్ను చూడగానే గోపాలకృష్ణ కుమారుడు సుబ్బారావునాయుడు కన్నీరు పెట్టుకున్నారు. జగన్ ఆయన భుజం తట్టి ఓదార్చారు.
అనంతరం జగన్.. గోపాలకృష్ణ భార్య అచ్యుతామణి, తల్లి వీరరాఘవమ్మ, కుమార్తె మంగాదేవిలను పరామర్శించారు. ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్వించే అన్న గోపాలకృష్ణకు ఇలా జరుగుతుందని ఊహించలేకపోయానని జగన్ విచారం వ్యక్తం చేశారు. పెద్దాయన మరణం తనను కలచివేస్తోందని, మీ కుటుంబానికి పెద్ద బిడ్డగా ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటానని అచ్యుతామణికి ధైర్యం చెప్పారు. గోపాలకృష్ణ ఆస్పత్రికి వెళ్లే ముందు కూడా తనను కలిసి ప్రజాబలం మనవైపే ఉందని ధైర్యం చెప్పిన విషయాన్ని జగన్ గుర్తుతెచ్చుకున్నారు. అనంతరం సామర్లకోట, రాజమండ్రి మీదుగా గుంటూరు వెళ్లారు.
‘తోట’కు తుది వీడ్కోలు
గోపాలకృష్ణ భౌతిక కాయాన్ని కడసారి చూసి నివాళులర్పించేందుకు జిల్లా నలుమూలల నుంచి నేతలు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కిర్లంపూడి వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. మంత్రి తోట నరసింహం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా పరిశీలకుడు తోట నవీన్ గోపాలకృష్ణ భౌతికకాయం ఉన్న పాడెను మోశారు. మధ్యాహ్నం స్థానిక కుమ్మరివీధిలో ఉన్న శ్మశానవాటికలో సుబ్బారావునాయుడు.. తన తండ్రి చితికి నిప్పంటించారు. గోపాలకృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ఎంపీలు ఉండవల్లి అరుణ్కుమార్, జీవీ హర్షకుమార్, ఎమ్మెల్యేలు పిల్లి సుభాష్ చంద్రబోస్, గొల్ల బాబూరావు, వంగా గీత, పంతం గాంధీమోహన్, రౌతు సూర్యప్రకాశరావు తదితరులున్నారు.
సీఎం, బొత్స సంతాపం..
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తోట కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించారు. హైదరాబాద్ నుంచి ఫోన్లో గోపాలకృష్ణ కుమారుడు సుబ్బారావునాయుడిని పరామర్శించి కుటుంబానికి సంతాపం తెలిపారు.
0 comments:
Post a Comment