ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో అసలు దోషి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్దనరెడ్డి అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కు ఇచ్చిన స్థలం సమీపంలోనే చంద్రబాబు తన భార్య పేరుతో ఉన్న స్థలంని ఎకరా రెండు కోట్ల రూపాయలకు ఆనాడు అమ్మారు. ఆ తరువాత అదే ప్రాంతంలో ప్రభుత్వ భూమిని ఎమ్మార్ ప్రాపర్టీస్ కు కారు చౌకగా ఎకరం 39 లక్షల రూపాయలకే చంద్రబాబు ఇచ్చారు. ఈ 900 కోట్ల రూపాయల కుంభకోణానికి అసలు సూత్రధారి చంద్రబాబు నాయుడే అని ఆయన స్పష్టం చేశారు.
మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టేందుకు సిబిఐ, అసలు కారకుడైన చంద్రబాబు నాయుడుని వదిలివేసి, జగన్మోహన రెడ్డిని ఏ విధంగా ఇరికిద్దామా? అన్న రీతిలో వ్యవహరిస్తోందన్నారు. సిబిఐ అధికారి లక్ష్మీనారాయణ నిజమైన దోషులను పట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆ పార్టీ మరో అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ సిబిఐ టిడిపి చేతికర్రలాగా పనిచేస్తోందన్నారు. సిబిఐ మొదట ఎవరినో ఒకరిని అరెస్ట్ చేస్తుంది. ఆ వెంటనే టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తారు. డొంక కదిలింది అని ఎల్లో మీడియా ప్రచారం మొదలు పెడుతుంది. ఈ మూడింటికి మధ్య ఉన్న సంబంధం అందరికీ అర్ధమవుతోందన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో ప్రధాన నిందితుడు కోనేరు ప్రసాద్ కు చంద్రబాబు నాయుడుకు ఉన్న లింకు గురించి అందరికీ తెలుసన్నారు. సిబిఐ ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకోవడం మంచిదికాదన్నారు. అసలు ఇది ప్రజాస్వామ్యమేనా అని ఆయన ప్రశ్నించారు.
మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టేందుకు సిబిఐ, అసలు కారకుడైన చంద్రబాబు నాయుడుని వదిలివేసి, జగన్మోహన రెడ్డిని ఏ విధంగా ఇరికిద్దామా? అన్న రీతిలో వ్యవహరిస్తోందన్నారు. సిబిఐ అధికారి లక్ష్మీనారాయణ నిజమైన దోషులను పట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆ పార్టీ మరో అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ సిబిఐ టిడిపి చేతికర్రలాగా పనిచేస్తోందన్నారు. సిబిఐ మొదట ఎవరినో ఒకరిని అరెస్ట్ చేస్తుంది. ఆ వెంటనే టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తారు. డొంక కదిలింది అని ఎల్లో మీడియా ప్రచారం మొదలు పెడుతుంది. ఈ మూడింటికి మధ్య ఉన్న సంబంధం అందరికీ అర్ధమవుతోందన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో ప్రధాన నిందితుడు కోనేరు ప్రసాద్ కు చంద్రబాబు నాయుడుకు ఉన్న లింకు గురించి అందరికీ తెలుసన్నారు. సిబిఐ ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకోవడం మంచిదికాదన్నారు. అసలు ఇది ప్రజాస్వామ్యమేనా అని ఆయన ప్రశ్నించారు.
0 comments:
Post a Comment