ప్రముఖ ఆడిటర్ విజయసాయి రెడ్డికి సిబిఐ చుక్కలు చూపిస్తోందని కొన్ని పత్రికలలో కథనాలు వచ్చాయని, వాస్తవానికి ఆయన ధైర్యాన్ని చూసి ఆ పత్రికలకే చుక్కలు కనిపిస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాశిరెడ్డి పద్మ అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. పాత్రికేయ విలువలను సమాధి చేస్తున్నట్లుగా ఆ పత్రికల కథనాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఎల్లో మీడియా రాతలు చూసి కోర్టులు, ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి కేసులో సిబిఐ ఎందుకు అత్యుత్సాహం చూపిస్తోందని ఆమె ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాలనలో రైతులు ప్రత్యక్ష నరకం చూశారని తెలిపారు. ఆయన ఇప్పుడు రైతుల గురించి మాట్లాడితే ఎవరూ నమ్మరన్నారు. తెలంగాణ అంశంలో ఆయన మాట తప్పారని విమర్శించారు. తొలుత తెలంగాణకు అనుకూలం అని చెప్పి, ఆ తరువాత రెండు కళ్ల సిద్ధాంతం అన్నారన్నారు. ఈ విషయంలో ఆయన దాటవేత ధోరణి అవలంభిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరి అవలంభించకపోవడం వల్లే సమస్య తలెత్తిందన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాలనలో రైతులు ప్రత్యక్ష నరకం చూశారని తెలిపారు. ఆయన ఇప్పుడు రైతుల గురించి మాట్లాడితే ఎవరూ నమ్మరన్నారు. తెలంగాణ అంశంలో ఆయన మాట తప్పారని విమర్శించారు. తొలుత తెలంగాణకు అనుకూలం అని చెప్పి, ఆ తరువాత రెండు కళ్ల సిద్ధాంతం అన్నారన్నారు. ఈ విషయంలో ఆయన దాటవేత ధోరణి అవలంభిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరి అవలంభించకపోవడం వల్లే సమస్య తలెత్తిందన్నారు.
0 comments:
Post a Comment