మహానేత అడుగుజాడల్లోనే ఆయన సతీమణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే విజయమ్మ నడుస్తున్నారు. నియోజకవర్గ ప్రజలతో ఆమె మమేకమై వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నారు. పులివెందులలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఈ దృశ్యమే కనిపించింది.
పులివెందులలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయంలో విజయమ్మను పలువురు ప్రజలు కలుసుకున్నారు. ఈ సందర్బంగా తమ సమస్యలను విన్నవించారు. వికలాంగులు, వృద్ధులు తమకు పింఛన్ ఇప్పించాలని కోరారు. ప్రభుత్వ పథకాల అమలులో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆమెకు ఫిర్యాదు చేశారు. వినతులు, ఫిర్యాదులను ఓపికగా విన్న విజయమ్మ సానుకూలంగా స్పందించారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేయించి వివరించారు. సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు.
పులివెందులలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయంలో విజయమ్మను పలువురు ప్రజలు కలుసుకున్నారు. ఈ సందర్బంగా తమ సమస్యలను విన్నవించారు. వికలాంగులు, వృద్ధులు తమకు పింఛన్ ఇప్పించాలని కోరారు. ప్రభుత్వ పథకాల అమలులో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆమెకు ఫిర్యాదు చేశారు. వినతులు, ఫిర్యాదులను ఓపికగా విన్న విజయమ్మ సానుకూలంగా స్పందించారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేయించి వివరించారు. సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు.
0 comments:
Post a Comment