వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ పర్యటన ఆదివారం ప్రారంభం కానుంది. ఇటు నగరంలోనూ, అటు జిల్లాలోనూ ఆయన రోడ్డుషో నిర్వహించనున్నారు. వాస్తవానికి శనివారం ఈ పర్యటన జరగాల్సి ఉంది. అయితే పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు తండ్రి ఆకస్మిక మరణంతో జగన్ పర్యటన ఆదివారానికి వాయిదా పడింది. ఆదివారం ఉదయం 9.00 గంటలకు జగన్మోహన్రెడ్డి మద్దిలపాలెంలో నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.
అనంతరం పలు చోట్ల పర్యటించి.. రాజగోపాలపురంలో ఆ గ్రామస్తులు సొంత నిధులతో నిర్మించిన వైఎస్సార్ ఆలయానికి ప్రారంభిస్తారు. పాల్తేరులో వైఎస్సార్ విగ్రహావిష్కరణతో జిల్లా పర్యటన ముగుస్తుంది. అనంతరం జగన్మోహన్రెడ్డి తూర్పుగోదావరి జిల్లా ఎ.సూరవరంలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ పూర్తి చేసుకుని రాత్రి 11.35 గంటలకు సామర్లకోటలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ఎక్కి గుంటూరు ఓదార్పుయాత్రకు పయనమవుతారు. జిల్లా పర్యటనలో పలుచోట్ల కాంగ్రెస్, టీడీపీ, ప్రజారాజ్యం పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్లో చేరనున్నారు.
అనంతరం పలు చోట్ల పర్యటించి.. రాజగోపాలపురంలో ఆ గ్రామస్తులు సొంత నిధులతో నిర్మించిన వైఎస్సార్ ఆలయానికి ప్రారంభిస్తారు. పాల్తేరులో వైఎస్సార్ విగ్రహావిష్కరణతో జిల్లా పర్యటన ముగుస్తుంది. అనంతరం జగన్మోహన్రెడ్డి తూర్పుగోదావరి జిల్లా ఎ.సూరవరంలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ పూర్తి చేసుకుని రాత్రి 11.35 గంటలకు సామర్లకోటలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ఎక్కి గుంటూరు ఓదార్పుయాత్రకు పయనమవుతారు. జిల్లా పర్యటనలో పలుచోట్ల కాంగ్రెస్, టీడీపీ, ప్రజారాజ్యం పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్లో చేరనున్నారు.
0 comments:
Post a Comment