జైలుకెళ్లాల్సిన బాబును ఎందుకు కాపాడినట్లు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జైలుకెళ్లాల్సిన బాబును ఎందుకు కాపాడినట్లు?

జైలుకెళ్లాల్సిన బాబును ఎందుకు కాపాడినట్లు?

Written By ysrcongress on Saturday, February 25, 2012 | 2/25/2012


సీఎం బహిరంగపర్చాలన్న బాజిరెడ్డి 
చంద్రబాబు ఏజెంట్ కిరణ్

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఎమ్మార్ కేసులో జైలుకెళ్లాల్సిన టీడీపీ అధినేత చంద్రబాబును సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఎందుకు కాపాడారో బహిరంగపర్చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు. కిరణ్-చంద్రబాబుల వ్యవహారం ‘లోపల కుస్తీ... బయట దోస్తీ’ అన్న చందంలా ఉందని విమర్శించారు. చంద్రబాబుకు ఏజెంట్‌లా సీఎం పనిచేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శాసనసభలో ఇద్దరూ ఒకరి ప్రయోజనాలు మరొకరు కాపాడుకుంటూ అధికారపక్ష పాత్రలో కిరణ్, ప్రతిపక్షపాత్రలో చంద్రబాబు రక్తి కట్టించారని దుయ్యబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనేందుకు వీరిద్దరూ చేస్తున్న అరాచకాలు, కుట్రలు, కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. 

‘‘ఎమ్మార్‌లో విల్లాలు కొనుగోలు చేసిన వారందరినీ విచారించిన సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ... చంద్రబాబు కోడలు బ్రహ్మణిని నేరుగా ఎందుకు విచారించలేదు? కాంగ్రెస్‌తో ఉన్నఫిక్సింగ్ కారణంగానే వారి వద్దకు వెళ్లలేదా? ఈ కేసులో జైలుకెళ్లాల్సిన చంద్రబాబును కూడా అందులో భాగంగానే సీఎం కిరణ్ ఆదుకున్నట్లా?’’ అని నిలదీశారు. వైఎస్ మరణం తర్వాత శంకర్రావు పిటిషన్ మొదలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, బాన్సువాడ ఉప ఎన్నిక, మానవహక్కుల కమిషన్ చైర్మన్ ఎంపిక, అవిశ్వాస తీర్మానం... ఆఖరికి సమాచార కమిషనర్ల దాకా ఇలా అన్నింట్లో కాంగ్రెస్‌తో చంద్రబాబు చేసుకున్న మ్యాచ్‌ఫిక్సింగ్‌ను ఆయన వివరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఇన్నాళ్లుగా చెబుతున్న వాటినే తాజాగా పీసీసీ చీఫ్ బొత్ససత్యనారాయణ, మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి చెబుతున్నారని తెలిపారు. 

లోకేష్ ‘చదివింపు’లు బయటపెట్టాలి

చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌కు విదేశాల్లో చదువుకు ఖర్చు చేసిన మొత్తానికి సంబంధించి ఐటీ రిటర్న్, బ్యాంక్ లావాదేవీలను ప్రజల ముందుంచాలని గోవర్ధన్ డిమాండ్ చేశారు. అతని యూనివర్సిటీ ప్రవేశానికి కారణమైన జీమ్యాట్ స్కోర్‌ను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. లోకేష్ చదువుకు సత్యం రామలింగరాజు రూ.60 కోట్లు చెల్లించారని దివంగత వైఎస్‌ఆర్ అసెంబ్లీలో బయటపెడితే దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందంగా ఇన్నాళ్ల తర్వాత చంద్రబాబు స్పందించడంలో మర్మమేమిటని నిలదీశారు. లోకేష్ చదువులకు తానే డబ్బు కట్టినట్లయితే ఇన్నాళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తప్పుడు మాటలు, అసత్యాలతో కాలం వెళ్లదీసే చంద్రబాబు... తాను గొప్ప సత్యహరిశ్చంద్రుడినని చెప్పుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
Share this article :

0 comments: