గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర ప్రజల ఆదరాభిమానాల మధ్య విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఆయన యాత్రను విప్పర్ల నుంచి ప్రారంభించనున్నారు. రాత్రి నరసరావుపేటలోని సాగర్ అతిథిగృహంలో బస చేసిన జగన్ కొద్దిసేపటి క్రితం ఓదార్పుయాత్రకు బయల్దేరారు. ఆత్మీయ నేతను చూసేందుకు ఆయన బస చేసిన అతిథిగృహం వద్ద అభిమానులు, కార్యకర్తలు బారులు తీరారు. వారందరికీ అభివాదం చేస్తూ జగన్ విప్పర్లకు పయనమయ్యారు. విప్పర్ల నుంచి యాత్ర కొత్తపల్లి, సంతగుడిపాడు మీదగా మాచవరం చేరుకుంటుంది. రాత్రి మాచవరంలోనే ఆయన బస చేస్తారు. మహానేతను అప్రతిష్టపాలు చేసేందుకు కాంగ్రెస్,టీడీపీలు కుమ్ముక్కై రాజకీయాలు చేస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా విప్లర్ల రెడ్డిపాలెంలో బుధవారం వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మహానేత ఉన్నప్పుడు ఒక్కమాటకూడా మాట్లాడని కాంగ్రెస్ నాయకులు నేడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. చనిపోయిన వైఎస్కు ఓ న్యాయం.. బతికున్న చంద్రబాబుకు మరోన్యాయం అన్నట్లుగా సిబిఐ ప్రవర్తిస్తోందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు ఆయన నర్సరావుపేటఅడ్డరోడ్డులోని అభయాంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. |
Home »
» వైఎస్ ను అప్రతిష్ట పాల్జేస్తున్నారు
వైఎస్ ను అప్రతిష్ట పాల్జేస్తున్నారు
Written By ysrcongress on Wednesday, February 8, 2012 | 2/08/2012
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
There is no other big barbarious action than attempting to defame the GREAT YSR, in AP. When people are building temples for him, attempt to defame YSR is like fighting against GOD. We know who fought GODs in our GREAT Mythology of the WORLD.
Post a Comment