'కోవూరు ఉప ఫలితాలతో దిమ్మ తిరగాలి' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'కోవూరు ఉప ఫలితాలతో దిమ్మ తిరగాలి'

'కోవూరు ఉప ఫలితాలతో దిమ్మ తిరగాలి'

Written By ysrcongress on Monday, February 27, 2012 | 2/27/2012

 వైఎస్ పేరుతో అందలం ఎక్కి అధికారం చెలాయిస్తున్న వారికి బుద్ది వచ్చేలా కోవూరు ఉప ఎన్నికల తీర్పు ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ కార్యకర్తలకు సూచించారు. తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో వచ్చే మెజార్టీ దెబ్బకు ఢిల్లీ పెద్దలకు దిమ్మ తిరుగుతుందని చెప్పిన కొణతాల ఆ స్థాయిలో కార్యకర్తలు పని చేయాలన్నారు.

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఉదయం వినుకొండ పల్నాడు రోడ్డు దస్తగిరి పాయింట్‌ నుంచి ఓదార్పు యాత్రకు బయల్దేరారు. అభిమానుల కోలహలం మధ్య ఆషా థియేటర్‌ సెంటర్లో విగ్రహా విష్కరణకు వెళ్లారు. రాత్రి డాక్టర్‌ దస్తగిరి నివాసంలో బస చేసిన జగన్ ఉదయం 9.45 నిమిషాలకు ఓదార్పు బాట పట్టారు. ఆత్మీయ నేత వెంట ఓదార్పులో పాల్గొనడానికి వేలాది జనం తరలివచ్చారు.

Share this article :

0 comments: