Home »
» కార్యకర్తలపై పోలీసుల జులుం: వైఎస్ అవినాష్
కార్యకర్తలపై పోలీసుల జులుం: వైఎస్ అవినాష్
వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో కార్యకర్తలపై పోలీసులు ప్రదర్శిస్తున్న జులుం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ నేత వైఎస్ అవినాశ్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తల పట్ల అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్ని నమోదు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉన్నతాధికారులు, మంత్రుల ఒత్తిడి వల్లే పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అవినాశ్ అన్నారు. పోలీసుల జులుం వల్ల పార్టీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం తగ్గదని, న్యాయం కోసం పోరాటం చేస్తామని ఆయన అన్నారు. పులివెందులలో ఓ హత్యా నేరంలో ముద్దాయిగా ఉన్న మల్లికార్జున ఫిర్యాదుపై పార్టీ కార్యకర్త శంకర్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించారని అవినాశ్ అన్నారు. |
0 comments:
Post a Comment