ఆరోగ్యమే - మహాభాగ్యం అనే నినాదంతో వైఎస్సార్ సేవాదళం రాష్ట్రవ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సేవాదళం కన్వీనర్ కోటింరెడ్డి వినయ్రెడ్డి అధ్యక్షతన ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆరోగ్య రంగానికి ఇచ్చిన ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ... రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శిబిరాలను నిర్వహించాలని కమిటీ అభిప్రాయపడింది. అందుకు అనుగుణంగా ఫిబ్రవరి 19న నిజామాబాద్, ఫిబ్రవరి 26న హైదరాబాద్, మార్చి 4న మహబూబ్నగర్, 11న మెదక్, 18న నల్లగొండ జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆరోగ్య శిబిరాలను నిర్వహించాలని నిర్ణయించారు.
Home »
» వైఎస్సార్ సేవాదళం ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు
వైఎస్సార్ సేవాదళం ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు
Written By ysrcongress on Monday, February 6, 2012 | 2/06/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment