కిరణ్ తో బాబు లాలూచీ పడ్డారు: బొత్స - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కిరణ్ తో బాబు లాలూచీ పడ్డారు: బొత్స

కిరణ్ తో బాబు లాలూచీ పడ్డారు: బొత్స

Written By ysrcongress on Wednesday, February 15, 2012 | 2/15/2012

పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన అసెంబ్లీ లాబీలో విలేకర్లతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పలు అంశాల్లో ముఖ్యమంత్రి, చంద్రబాబునాయుడు ఒక్కటయ్యారన్న అంశం వెల్లడయిందన్నారు. సమాచార కమిషనర్ల ఎంపిక వ్యవహారమే ఇందుకు నిదర్శనమన్నారు. అందరి ఆమోదంతోనే కమిషనర్లను ఎంపిక చేసామని ముఖ్యమంత్రి చెప్పారని, దాని అర్థమేమిటని ఆయన ప్రశ్నించారు.

దీనిపై చంద్రబాబు డీసెంట్ నోట్ పంపారని టీడీపీ నేతలు చెప్పడాన్ని బట్టి బాబు వ్యవహారం ఏంటో అందరికీ అర్థం అవుతుందని బొత్స ముక్తాయించారు. తనపై ఆరోపణలు వచ్చినందుకు విచారణను కోరానని ఆయన తెలిపారు. మద్యం పాలసీని ప్రకటించాల్సింది పార్టీ కాదని, ప్రభుత్వానిదే ఆ బాధ్యత అన్నారు. ప్రస్తుత విధానం లోప భూయిష్టంగా ఉందన్నారు.
Share this article :

0 comments: