Home »
» జగన్ రాడేమోనని ఆత్మహత్యాయత్నం
జగన్ రాడేమోనని ఆత్మహత్యాయత్నం
వినుకొండ, న్యూస్లైన్: వైఎస్ జగన్ గుంటూరు జిల్లాలో నిర్వహిస్తున్న ఓదార్పు యాత్ర తమ గ్రామంలో జరగదనే భావనతో ముండ్రువారిపాలేనికి చెందిన ఇద్దరు స్నేహితులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో దూదేకుల నబీసాహెబ్(50) మృతిచెందగా.. తన్నీరు ఆంజనేయులు(35) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వినుకొండ నియోజకవర్గంలో ఓదార్పుయాత్ర జరుగుతుండడంతో తమ గ్రామానికి కూడా జగన్ వస్తారన్న నమ్మకంతో సాహెబ్ తన సొంత స్థలంలో వైఎస్సార్ విగ్రహం పెట్టడానికి దిమ్మె ఏర్పాటు చేశారు.
అయితే జగన్ తమ గ్రామానికి రావడం లేదని కొందరు నేతలు చెప్పడంతో వారు కలత చెంది ఆదివారం పురుగుల మందు తాగారు. విషయం తెలుసుకున్న జగన్ ఆస్పత్రిలో ఆంజనేయులును పరామర్శించారు. ‘మీ ఊరు రానని ఎవరు అన్నారు? కచ్చితంగా వచ్చేవాడిని కదా. మీరిలా చేసుకుంటే పిల్లలకు దిక్కెవరు? నా పర్యటన జరగదని ఇలా ప్రాణాల మీదకు ఎవరూ తెచ్చుకోవద్దు’ అని సూచించారు.
|
|
0 comments:
Post a Comment