చంద్రబాబు నాయుడు బ్రతుకు అంతా కుట్రల మయం అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అన్నారు. విద్యుత్ ఛార్జిలపై పోరాడిన ముగ్గుర్ని కాల్చి చంపిన చరిత్ర చంద్రబాబుదని ఆయన అన్నారు. కుట్రలకు కేరాఫ్ అడ్రస్, అబద్దాలకు పెద్ద కొడుకు చంద్రబాబు అని.. గోదావరిలో మునిగినా ఆయన పాపాలు పోవని కేసీఆర్ మండిపడ్డారు.
పోలవరం టెండర్లలో అక్రమాలు జరిగాయని తె లుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతంలోని ఆస్తులను అమ్మిన చరిత్ర బాబుదన్నారు. తెలంగాణ ప్రాంతానికి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుంభకోణాల్లో విచారణ జరిపించకుండా కోర్టుల్లో స్టే తెచ్చుకున్న ఘనత బాబుదేనన్నారు. పోలవరం టెండర్లపై సీబీఐ విచారణ చేయించాలని.. మా తప్పులేదని తేలితే ముక్కు నేలకు రాస్తారా అని చంద్రబాబుకు కేసీఆర్ సవాల్ విసిరారు.
పోలవరం టెండర్లలో అక్రమాలు జరిగాయని తె లుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతంలోని ఆస్తులను అమ్మిన చరిత్ర బాబుదన్నారు. తెలంగాణ ప్రాంతానికి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుంభకోణాల్లో విచారణ జరిపించకుండా కోర్టుల్లో స్టే తెచ్చుకున్న ఘనత బాబుదేనన్నారు. పోలవరం టెండర్లపై సీబీఐ విచారణ చేయించాలని.. మా తప్పులేదని తేలితే ముక్కు నేలకు రాస్తారా అని చంద్రబాబుకు కేసీఆర్ సవాల్ విసిరారు.
0 comments:
Post a Comment