సభాసంఘం ఏర్పాటుపై జూపూడి ధ్వజం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సభాసంఘం ఏర్పాటుపై జూపూడి ధ్వజం

సభాసంఘం ఏర్పాటుపై జూపూడి ధ్వజం

Written By ysrcongress on Friday, February 10, 2012 | 2/10/2012

భూకేటాయింపులపై ‘టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్’ లేకుండా వేసిన శాసనస సభాసంఘం కమిటీ కుట్రపూరితమైందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు దుయ్యబట్టారు. కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కై దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిని ద్రోహి, భూకబ్జాదారుడిగా చిత్రీకరించేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని అప్రతిష్టపాలు చేయాలనే కుట్రతో కాంగ్రెస్-టీడీపీలు చేస్తున్న నీచరాజకీయాలను గమనిస్తున్న ప్రజలే తిరగబడతారని హెచ్చరించారు. భూకేటాయింపులపై ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు హయాం 1995 నుంచి ఇప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కేటాయించిన వాటిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. 

పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎస్సీ సెల్ రాష్ట్రకన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్‌తో కలిసి గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘భూ కేటాయింపులపైన లేదా మరే అంశంపైనగానీ సభాసంఘం వేయాలని ప్రతిపక్షం అడిగినప్పుడు అధికారపక్షం అంగీకరించడం అసాధారణమేమీ కాదు. అయితే ప్రభుత్వం చేసిన తప్పులపై సభాసంఘం వేయమని సహజంగా ప్రతిపక్షం అడుగుతుంది. విచిత్రమేమిటంటే అధికారపక్షం, ప్రధాన ప్రతిపక్షం రెండూ ఒకే ఎజెండాతో సభాసంఘం వేయడం బహుశా రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. దివంగత వైఎస్సార్‌ను అప్రతిష్టపాలు చేయాలన్న ఏకైక లక్ష్యంతో చంద్రబాబు అడిగిన సభాసంఘాన్ని ఇప్పుడు వేయడం ప్రతిపక్షంతో అధికారపక్షం కుమ్మక్కు కాకుండా మరేం అవుతుంది?’’అని ప్రశ్నించారు. వైఎస్సార్ హయాంలో మంత్రులుగా ఉన్నవారే ప్రస్తుత కేబినెట్‌లోనూ కొనసాగుతున్నప్పుడు సభాసంఘం ద్వారా కొత్త విషయాలు ఏం తెలుసుకుంటారని నిలదీశారు. పరిశ్రమలకు జరుగుతున్న భూకేటాయింపులపై విచారణ జరపాలన్న చిత్తుశుద్ధి ప్రభుత్వానికి ఉంటే, గతంలో క్విడ్ ప్రో కో లపై శంకర్రావు వేసిన పిల్‌పై ‘మీ అభిప్రాయం చెప్పండి’అని కిరణ్ సర్కారును హైకోర్టు అడిగినా ఎందుకు సమాధానం చెప్పలేదని అడిగారు.

వైఎస్సార్ మరణించిన రెండున్నరేళ్ళ తర్వాత సభాసంఘం వేశారంటే కాంగ్రెస్-టీడీపీ సమష్టి కుట్ర కాదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో 24 కంపెనీలకు 18 వేల ఎకరాలను పప్పుబెల్లాల్లా పంచిపెట్టారని దుయ్యబట్టారు. అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆగమేఘాలమీద ఐఎంజీ భారత్ అనే కంపెనీకి 850 ఎకరాల భూమిని, కేబినెట్ అనుమతి కూడా లేకుండా తన బినామీ బిల్లీరావుకు 400 ఎకరాలను ధారాదత్తం చేశారని వీటన్నింటిని సభాసంఘం కిందకి తేవాలన్నారు. అదేవిధంగా రోశయ్య హయాంలో చంద్రబాబు సూచనల మేరకు టీడీపీకి చెందిన జీఎన్ నాయుడుకు ధారాదత్తం చేసిన హైదరాబాద్ నడిబొడ్డులోని వందల కోట్ల విలువచేసే భూములను, సీఎం కిరణ్ ప్రిజమ్ సిమెంట్స్‌కు కర్నూలులో కారుచౌకగా కేటాయించిన వెయ్యి ఎకరాల భూకేటాయింపును కూడా విచారణ పరిధిలోకి తేవాలని జూపూడి డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: