గుంటూరు జిల్లా పర్యటనను మరోరోజు వాయిదా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గుంటూరు జిల్లా పర్యటనను మరోరోజు వాయిదా

గుంటూరు జిల్లా పర్యటనను మరోరోజు వాయిదా

Written By ysrcongress on Sunday, February 5, 2012 | 2/05/2012

వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత, కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్రను ఈనెల 7వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. సోమవారమే గుంటూరులో ఓదార్పు యాత్ర ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ విశాఖ జిల్లా పర్యటన అశేష జనసంద్రం నడుమ సాగడంతో నిర్ణీత షెడ్యూల్ కన్నా ఆలస్యంగా కొనసాగుతోంది. దీంతో గుంటూరు జిల్లా పర్యటనను మరోరోజు వాయిదా వేశారు. మంగళవారం ఉదయం నుంచి ఓదార్పు యాత్ర నిర్వహించనున్నారని పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ప్రొగ్రామ్ కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్‌లు తెలిపారు. 7వ తేదీ తెల్లవారుజామున పిడుగురాళ్ళ చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన నకరికల్లు చేరుకుని స్వల్ప విశ్రాంతి అనంతరం యాత్ర ప్రారంభిస్తారని వారు వివరించారు
Share this article :

0 comments: