వైఎస్ఆర్ అభిమాన ఎమ్మెల్యేలు అందరూ కలిసికట్టుగానే ఉన్నట్లు వారు ప్రకటించారు. కాంగ్రెస్, టిడిపిలలోనే గందరగోళం నెలకొని ఉందని వారు చెప్పారు. లోటస్పాండ్లోని జగన్ క్యాంప్ కార్యాలయంలో అభిమాన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం ముగిసింది. శాసనసభలో, శాసన మండలిలో అనుసరించవలసిన వ్యూహం, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి వారితో చర్చించారు.
శాసనసభలో ప్రతిపక్షం పాత్ర పోషించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.ప్రజాసమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యేలు కొండా సురేఖ, అమరనాథరెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి చెప్పారు.
శాసనసభలో ప్రతిపక్షం పాత్ర పోషించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.ప్రజాసమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యేలు కొండా సురేఖ, అమరనాథరెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి చెప్పారు.
0 comments:
Post a Comment