నిరుపేదల కోసం దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చవద్దని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆరోగ్యశ్రీపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. ఆరోగ్యశ్రీ కింద ఇప్పటివరకూ ఉన్న 153 జబ్బులకు సంబంధించి చికిత్సను కార్పొరేట్ ఆసుపత్రుల జాబితా నుంచి తొలగించి ప్రభుత్వ ఆసుపత్రుల కింద చేర్చారని తెలిపారు. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంబంధిత వ్యాధుల చికిత్సకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించారా? అని ప్రశ్నించారు. మౌలిక సదుపాయాలు లేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేద రోగులు అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయకుమార్ జోక్యం చేసుకుంటూ... ‘ఆరోగ్యశ్రీ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. వైఎస్ కాదు’ అని అన్నారు. ఈ నేపథ్యంలో శోభా నాగిరెడ్డి ప్రతిస్పందిస్తూ... ‘ఈ పథకాన్ని వైఎస్ ప్రవేశ పెట్టలేదని భావిస్తే ఆ మాట రాష్ట్ర ప్రభుత్వం చేత చెప్పించండి’ అని సవాల్ చేశారు.
Home »
» ఆరోగ్యశ్రీని కాపాడండి
ఆరోగ్యశ్రీని కాపాడండి
Written By ysrcongress on Saturday, February 25, 2012 | 2/25/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment