ఢిల్లీ సందేశాల ప్రకారమే సీబీఐ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఢిల్లీ సందేశాల ప్రకారమే సీబీఐ

ఢిల్లీ సందేశాల ప్రకారమే సీబీఐ

Written By ysrcongress on Wednesday, February 1, 2012 | 2/01/2012

ఎమ్మార్‌, ఇతర కేసుల్లో సీబీఐ దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు. ఎమ్మార్ కేసులో అంతకు ముందు చంద్రబాబు పాత్రపై సీబీఐ కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదన్నారు. జగన్‌, వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ టార్గెట్‌గా దర్యాప్తు సాగుతోందని అంబటి మండిపడ్డారు. 

ఢిల్లీ సందేశాల ప్రకారమే సీబీఐ పని చేస్తుందన్నారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఆ రెండు పత్రికలకు వివరాలను లీక్ చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బాబును ఎందుకు విచారించటం లేదని హైకోర్టు నోటీసులు ఇచ్చినా సీబీఐ పట్టించుకోవటం లేదన్నారు. జేడీ లక్ష్మీనారాయణకు నార్కో పరీక్షలు నిర్వహించాలని, అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయని అంబటి అన్నారు.
Share this article :

0 comments: