మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రెక్కల కష్టంతోనే రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వాలు రాజ్యమేలుతున్నాయని వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఓదార్పుయాత్రలో భాగంగా గుంటూరు జిల్లా పరగతిచర్ల సభలో జగన్ మాట్లాడారు. పరగతిచర్లలో జగన్కు గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. పరగతిచర్ల గ్రామస్థులు ఏర్పాటు చేసుకున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... దివంగత నేతను అప్రతిష్టపాలు చేయడానికి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కైనాయని ఆయన ఆరోపించారు.
మహానేత మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాలను పరామర్శిస్తానని నల్లకాలువలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నందుకే తనని ఇబ్బందిపాలు చేస్తున్నారని.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రజా సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. రాష్ట్ర ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. త్వరలో రాష్ర్టంలో సువర్ణయుగం రాబోతుందని ఆయన తెలిపారు.
సభాసంఘం అంతా భూటకం: బాజిరెడ్డి
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే ముఖ్యమంత్రి కిరణ్, ప్రతిపక్షనేత చంద్రబాబులు నాటకం ఆడుతున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డితో కలిసి బాజిరెడ్డి మాట్లాడారు.
సభాసంఘం అంతా భూటకమని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన భూకేటాయింపులపై న్యాయవిచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం కిరణ్ చేతగాని తనంవల్లే రాష్ట్రంలో ప్రజా సమస్యలు విలయతాండవం చేస్తున్నాయని బాజిరెడ్డి అన్నారు.
మహానేత మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాలను పరామర్శిస్తానని నల్లకాలువలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నందుకే తనని ఇబ్బందిపాలు చేస్తున్నారని.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రజా సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. రాష్ట్ర ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. త్వరలో రాష్ర్టంలో సువర్ణయుగం రాబోతుందని ఆయన తెలిపారు.
సభాసంఘం అంతా భూటకం: బాజిరెడ్డి
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే ముఖ్యమంత్రి కిరణ్, ప్రతిపక్షనేత చంద్రబాబులు నాటకం ఆడుతున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డితో కలిసి బాజిరెడ్డి మాట్లాడారు.
సభాసంఘం అంతా భూటకమని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన భూకేటాయింపులపై న్యాయవిచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం కిరణ్ చేతగాని తనంవల్లే రాష్ట్రంలో ప్రజా సమస్యలు విలయతాండవం చేస్తున్నాయని బాజిరెడ్డి అన్నారు.
0 comments:
Post a Comment