వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్క్ షాప్ చిత్తూరు జిల్లా తలకోనలో ప్రారంభమైంది. భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి అధ్వర్యంలో జరుగుతున్న వర్క్ షాప్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మేకపాటి రాజమోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కొణతాల రామకృష్ణలతో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమాన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
తొలుత మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి వర్క్ షాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని కోరారు.
జగన్ ప్రజల్లో ఉంటే.. తాను అధికారంలోకి రాలేనని చంద్రబాబు అర్ధమైందని.. అందుకే జగన్ను త్వరలోనే అరెస్ట్ చేస్తారంటూ అసత్య, విష ప్రచారాన్ని చేస్తున్నారని శోభానాగిరెడ్డి అన్నారు. దేశంలోనే గొప్ప ముఖ్యమంత్రిగా దివంగత నేత వైఎస్ ఎదిగారని ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి గుర్తు చేసుకున్నారు.
తొలుత మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి వర్క్ షాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని కోరారు.
జగన్ ప్రజల్లో ఉంటే.. తాను అధికారంలోకి రాలేనని చంద్రబాబు అర్ధమైందని.. అందుకే జగన్ను త్వరలోనే అరెస్ట్ చేస్తారంటూ అసత్య, విష ప్రచారాన్ని చేస్తున్నారని శోభానాగిరెడ్డి అన్నారు. దేశంలోనే గొప్ప ముఖ్యమంత్రిగా దివంగత నేత వైఎస్ ఎదిగారని ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి గుర్తు చేసుకున్నారు.
0 comments:
Post a Comment