వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల మూడో తేదీన తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో ధ్వంసానికి గురైన అంబేద్కర్ విగ్రహాల్ని పరిశీలించనున్నారు. హైదరాబాద్ నుంచి గౌతమి ఎక్స్ప్రెస్లో బయలుదేరి శుక్రవారం ఉదయం నేరుగా తాడేపల్లిగూడెం నుంచి నేరుగా అమలాపురం చేరుకుంటారని పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలసిల రఘురాం బుధవారమిక్కడ తెలిపారు. అక్కడి పార్టీ కన్వీనర్ కుడిపూడి చిట్టబ్బాయి నివాసంలో కొద్దిసేపు విరామం అనంతరం ధ్వంసానికి గురైన నాలుగు అంబేద్కర్ విగ్రహాలను పరిశీలించి దళిత నేతలతో మాట్లాడనున్నారు.
అనంతరం ఐ.పోలవరం మండలం పి.కొత్తపల్లి చేరుకుని యానాం సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన రీజెన్సీ సిరామిక్స్ కార్మిక నేత మురళీమోహన్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. తిరిగి అక్కడ నుంచి గోపాలపురం చేరుకుంటారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఇంట్లో కొద్దిసేపు విరామం తర్వాత ధవళేశ్వరం చేరుకుంటారు. ధ్వంసానికి గురైన అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలిస్తారు.
అనంతరం రాజమండ్రి చేరుకుని ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదిరెడ్డి అప్పారావు ఇంటికి వెళతారు. అక్కడ నుంచి ఆర్ట్స్ కళాశాల మైదానానికి చేరుకుని జాతీయ స్థాయి దేవాంగ మహాసభల్లో పాల్గొంటారు. అనంతరం రాత్రి రోడ్డు మార్గం ద్వారా విశాఖ పయనం అవుతారు.
అనంతరం ఐ.పోలవరం మండలం పి.కొత్తపల్లి చేరుకుని యానాం సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన రీజెన్సీ సిరామిక్స్ కార్మిక నేత మురళీమోహన్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. తిరిగి అక్కడ నుంచి గోపాలపురం చేరుకుంటారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఇంట్లో కొద్దిసేపు విరామం తర్వాత ధవళేశ్వరం చేరుకుంటారు. ధ్వంసానికి గురైన అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలిస్తారు.
అనంతరం రాజమండ్రి చేరుకుని ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదిరెడ్డి అప్పారావు ఇంటికి వెళతారు. అక్కడ నుంచి ఆర్ట్స్ కళాశాల మైదానానికి చేరుకుని జాతీయ స్థాయి దేవాంగ మహాసభల్లో పాల్గొంటారు. అనంతరం రాత్రి రోడ్డు మార్గం ద్వారా విశాఖ పయనం అవుతారు.
0 comments:
Post a Comment