సామాన్యులపై పెట్రోల్ బాంబు మళ్లీ పేలేందుకు సిద్ధమవుతోంది. లీటర్కు మూడు రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. యూపీ ఎన్నికలు పూర్తైన వెంటనే వడ్డింపు వాతలు పెట్టేందుకు ఆయిల్ కంపెనీలు సిద్ధం అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరిగినా రెండు నెలలుగా దేశంలో రేట్లు పెంచలేదని అంటున్నాయి ఆయిల్ కంపెనీలు.
ధరలు పెంచేందుకు అనుమతించాలని గత నెలలోనే చమురు కంపెనీలు ప్రభుత్వాన్ని కోరాయి. అయితే ఉత్తరప్రదేశ్ ఎన్నికల దృష్ట్యా నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటికైనా పెట్రోల్ ధరలు పెంచేందుకు అనుమతించాలని లేకపోతే తాము దివాలా తీయడం ఖాయమని ఆయిల్ కంపెనీలు హెచ్చరిస్తున్నాయి.
ధరలు పెంచేందుకు అనుమతించాలని గత నెలలోనే చమురు కంపెనీలు ప్రభుత్వాన్ని కోరాయి. అయితే ఉత్తరప్రదేశ్ ఎన్నికల దృష్ట్యా నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటికైనా పెట్రోల్ ధరలు పెంచేందుకు అనుమతించాలని లేకపోతే తాము దివాలా తీయడం ఖాయమని ఆయిల్ కంపెనీలు హెచ్చరిస్తున్నాయి.
0 comments:
Post a Comment