యానాంలోని రీజన్సీ సిరామిక్స్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. కార్మికులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్ర ప్రజలకు పొరుగు రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తోందని ఆయన ప్రశ్నించారు. 30 ఏళ్లుగా నడుస్తున్న ఫ్యాక్టరీకి లాకౌట్ ఎలా ప్రకటిస్తారని ఆయన అడిగారు.
యానాం కార్మికులకు న్యాయం జరగాలన్నది తన ఆకాంక్ష అన్నారు. వారికి తోడుగా, అండగా తాము ఉంటామని చెప్పారు. వారికి న్యాయం జరుగకపోతే తమ పార్టీ తరపున ధర్నా చేసేందుకు కూడా వెనుకాడం అన్నారు.యానాం పోలీసులపై చర్యకు డిమాండ్ చేయాలన్నారు. మంచి న్యాయవాదుల ను పెట్టుకోమని కార్మికులకు సలహా ఇచ్చారు. మంచి న్యాయవాదులను సమకూర్చే బాధ్యత తాము తీసుకుంటామని వారికి భరోసా ఇచ్చారు.
యానాం కార్మికులకు న్యాయం జరగాలన్నది తన ఆకాంక్ష అన్నారు. వారికి తోడుగా, అండగా తాము ఉంటామని చెప్పారు. వారికి న్యాయం జరుగకపోతే తమ పార్టీ తరపున ధర్నా చేసేందుకు కూడా వెనుకాడం అన్నారు.యానాం పోలీసులపై చర్యకు డిమాండ్ చేయాలన్నారు. మంచి న్యాయవాదుల ను పెట్టుకోమని కార్మికులకు సలహా ఇచ్చారు. మంచి న్యాయవాదులను సమకూర్చే బాధ్యత తాము తీసుకుంటామని వారికి భరోసా ఇచ్చారు.
0 comments:
Post a Comment