మహానేత వైఎస్ఆర్ అకాల మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన ఒగ్గు నాగేశ్వరరావు కుటుంబాన్ని వైఎస్ జగన్ సోమవారం పరామర్శించారు. ఆ కుటుంబానికి అన్నివిధాల అండగా ఉంటానని జగన్ ఓదార్పు నిచ్చారు. వినుకొండ నిమ్మలబావి బజార్ కు చెందిన నాగేశ్వరరావు తాపీమేస్త్రీగా కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవారు.
మహానేత పాలనలో అతను ఎంతో లబ్ధి పొందాడు. ఇందిరమ్మ ఇల్లు, అంత్యోదయ కార్డుతో బియ్యం, మనవడికి ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేయించటం... తదితర పథకాల వల్ల లబ్ధి పొందటంతో వైఎస్ పై అభిమానం పెంచుకున్నాడు. సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ కనిపించడంలేదని తెలిసినప్పటి నుంచి టీవీ చూస్తూ ఇంటికే పరిమితమయ్యాడు. వైఎస్ మరణ వార్త విని గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు. నాగేశ్వరరావు భార్య గురవమ్మ ఫించన్ తో జీవనం సాగిస్తుంది. ఎన్నో కష్టాల్లో ఉన్న తమను జగన్ వచ్చి పరామర్శించటం ఆనందంగా ఉందని నాగేశ్వరరావు కుటుంబసభ్యులు తెలిపారు.
మహానేత పాలనలో అతను ఎంతో లబ్ధి పొందాడు. ఇందిరమ్మ ఇల్లు, అంత్యోదయ కార్డుతో బియ్యం, మనవడికి ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేయించటం... తదితర పథకాల వల్ల లబ్ధి పొందటంతో వైఎస్ పై అభిమానం పెంచుకున్నాడు. సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ కనిపించడంలేదని తెలిసినప్పటి నుంచి టీవీ చూస్తూ ఇంటికే పరిమితమయ్యాడు. వైఎస్ మరణ వార్త విని గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు. నాగేశ్వరరావు భార్య గురవమ్మ ఫించన్ తో జీవనం సాగిస్తుంది. ఎన్నో కష్టాల్లో ఉన్న తమను జగన్ వచ్చి పరామర్శించటం ఆనందంగా ఉందని నాగేశ్వరరావు కుటుంబసభ్యులు తెలిపారు.
0 comments:
Post a Comment