Home »
» మున్ముందు సమస్యలు తీరుతాయన్న భరోసా
మున్ముందు సమస్యలు తీరుతాయన్న భరోసా
వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధర్మవరంలో చేపట్టిన 48 గంటల దీక్ష చేనేత కార్మికుల్లో మనోధైర్యాన్ని నింపింది. తమ సమస్యల పరిష్కారం గురించి పరితపించే నాయకుడు ఉన్నాడని, మున్ముందు సమస్యలు తీరుతాయన్న భరోసా వారికి లభించింది. చేనేత దీక్ష ప్రారంభానికిముందు రోజు నుంచి జగన్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. అయినా ఏమాత్రం లెక్క చేయకుండా నేతన్నల సమస్యలపై ప్రభుత్వం కళ్లు తెరిపించాలనే ఉద్దేశంతో ముందుగా అనుకున్నట్లే ఈ నెల 12న జగన్ దీక్ష ప్రారంభించారు.
పేదల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించే గుణం ఉండటం వల్లే జగన్కు అపూర్వ ఆదరణ లభిస్తోందని దీక్షకు వచ్చిన ప్రజలు వ్యాఖ్యానించారు. సంఘీభావం తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి జనం స్వచ్ఛందంగా తరలి వచ్చారు. పలువురు చేనేత కార్మికులు జగన్తో పాటే దీక్ష చేపట్టారు. చిన్నపిల్లల నుంచి నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు సైతం దీక్షకు తరలివచ్చారు. జగన్కు తమ కష్టాలను చెప్పుకున్నారు. నీరసంతో ఉన్నా ప్రతి ఒక్కరినీ ఆయన ఆప్యాయంగా పలకరిస్తూ, వారు చెప్పిన విషయాలన్నీ ఓపిగ్గా విన్నారు. |
|
0 comments:
Post a Comment