కార్మిక నేత మురళీమోహన్ కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఘటన వివరాలను ఆయన కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మురళీమోహన్ చేసిన తప్పేంటని ప్రశ్నించారు. కార్మిక నేతను పోలీసులు కొట్టి చంపడం అన్యాయమన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించక పోవడం దారుణమన్నారు. చివరకు మురళీమోహన్ గుండెపోటుతో చనిపోయారని చిత్రీకరించడం బాధాకరమన్నారు. యాజమాన్య ప్రతినిధి చనిపోవడం కూడా బాధాకరం అన్నారు. పాండిచ్చేరి ప్రభుత్వ తీరును కూడా జగన్ ఎండగట్టారు.
కార్మిక నాయకుడు మురళి కార్మికుల హక్కుల కోసం పోరాడటం నేరమా అని ప్రశ్నించారు. మురళి మృతితోనే కార్మికులు ఆందోళన చేశారన్నారు. 9 మంది కార్మికులు గాయపడితే ప్రభుత్వం నిద్రపోతుందా? అని జగన్ ప్రశ్నించారు.
కార్మిక నాయకుడు మురళి కార్మికుల హక్కుల కోసం పోరాడటం నేరమా అని ప్రశ్నించారు. మురళి మృతితోనే కార్మికులు ఆందోళన చేశారన్నారు. 9 మంది కార్మికులు గాయపడితే ప్రభుత్వం నిద్రపోతుందా? అని జగన్ ప్రశ్నించారు.
0 comments:
Post a Comment