Home »
» 19 నుంచి గుంటూరులో ఓదార్పు
19 నుంచి గుంటూరులో ఓదార్పు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పు యాత్ర ఈ నెల 19న గుంటూరు జిల్లాలో పునః ప్రారంభమవుతుందని పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ప్రోగ్రామ్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్ బుధవారం ‘న్యూస్లైన్’కు తెలిపారు. ఈ నెల 9న యాత్ర పునఃప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కొవ్వూరులో ఉప ఎన్నికల ప్రచారంలో జన తాకిడి వల్ల షెడ్యూల్లో జాప్యం చోటు చేసుకుందని, దీంతో యాత్రను మరికొన్ని రోజులు వాయిదా వేశామని వివరించారు. 19న జగన్ చిలకలూరిపేట పట్టణంలో దివంగత వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి యాత్ర కొనసాగిస్తారని తెలిపారు. |
0 comments:
Post a Comment