తొలి రెండుగంటల్లో 20 శాతం ఓటింగ్‌ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తొలి రెండుగంటల్లో 20 శాతం ఓటింగ్‌

తొలి రెండుగంటల్లో 20 శాతం ఓటింగ్‌

Written By news on Sunday, March 18, 2012 | 3/18/2012

ఉపఎన్నికల పోలింగ్‌ జోరుగా సాగుతోంది. మొదటి రెండు గంటల్లో దాదాపు 10 శాతం పోలింగ్‌ నమోదైంది. మహబూబ్‌ నగర్‌ 19 శాతం, కామారెడ్డి, కొల్లాపూర్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌లో 18 శాతం, నాగర్‌ కర్నూలులో 17 శాతం, కోవూరులో 11 శాతం, ఆదిలాబాద్‌లో 9 శాతం పోలింగ్‌ నమోదైంది. సాయంత్రం ఐదు గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. సాయంత్రం అయిదు గంటల వరకు లైన్‌లో ఉన్న ఓటర్లకు ఎంత రాత్రైనా ఓటు వేసేందుకు అనుమతిస్తారు. 

ఓటర్‌ గుర్తింపు కార్డులు లేని వారు... ఎన్నికల సంఘం గుర్తించిన 16 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. 7 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ ఉపఎన్నికల్లో దాదాపు 13.82 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కామారెడ్డి, కోవూరు నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కంటే మహిళల సంఖ్య ఎక్కువ. 67 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నెల్లూరు జిల్లా కోవూరులో అత్యధికంగా 14 మంది బరిలో ఉన్నారు. 13 మంది అభ్యర్థులతో మహబూబ్‌నగర్‌ రెండో స్థానంలో ఉంది. 

ఉప ఎన్నికలు జరుగుతున్న ఏడు నియోజకవర్గాల్లో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దాంతో పోలింగ్ ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. ఆదిలాబాద్ నియోజకవర్గం చాందా (టి), మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజవర్గంలోని కోడేరు మండలం రాజాపూర్ , వీపనగండ్ల, పెద్దమారూరు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయలేదు. దాంతో పోలింగ్ ప్రక్రియ కొన్నిచోట్ల ఆలస్యంగా ప్రారంభమైంది. 
Share this article :

0 comments: