20 నుంచి గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 20 నుంచి గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్ర

20 నుంచి గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్ర

Written By ysrcongress on Monday, March 19, 2012 | 3/19/2012


21న చిలకలూరిపేటలో బహిరంగ సభ

గుంటూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 20 నుంచి గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్రను పునఃప్రారంభిస్తారని పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ప్రోగ్రామ్ కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్‌లు తెలిపారు. వినుకొండ నియోజకవర్గం నుంచి యాత్ర ప్రారంభమవుతుందన్నారు. అనంతరం చిలకలూరిపేట, ప్రత్తిపాడు నియోజకవర్గం, గుంటూరులోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ఓదార్పు యాత్ర జరిగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశామని ఆదివారం ‘న్యూస్‌లైన్’కు వివరించారు. 

జిల్లాలో ఈనెల 19న యాత్ర ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ.. ఉప ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పోలీసు బలగాలు బందోబస్తుకు వెళ్లటంతో పోలీసు అధికారుల విజ్ఞప్తి మేరకు ఒకరోజు ఆలస్యంగా యాత్ర ప్రారంభమవుతోందని పేర్కొన్నారు. జగన్ 19వ తేదీ రాత్రి హైదరాబాద్‌లో బయలుదేరి 20న ఉదయం వినుకొండ నియోజకవర్గానికి చేరుకుని యాత్ర ప్రారంభిస్తారని చెప్పారు. 21న సాయంత్రం 4 గంటలకు చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ జరుగుతుందని వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు నాలుగు విడతలుగా 71 రోజులపాటు జగన్ 13 నియోజకవర్గాల్లో పర్యటించారని వివరించారు. అడుగడుగునా ప్రజలు జగన్‌ను పట్టుబట్టి తమ ఊళ్లకు తీసుకువెళ్లి విగ్రహావిష్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో యాత్ర నిర్ణీత షెడ్యూల్డ్ కన్నా ఆలస్యంగా సాగుతోందన్నారు.
Share this article :

0 comments: