వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి మార్చి 29 తేదిన ఉదయం 9 గంటలకు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. కోవూరు ఉప ఎన్నికలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఉప ఎన్నికలు జరగనున్న 18 స్థానాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కమిటి సభ్యుడు భూమా నాగిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీడీపీలు 2,3 స్థానాలకు పాకులాడటం విడ్డూరంగా ఉందన్నారు. భవిష్యత్లో జగన్ సీఎం కావడం అనేది కోవూరు ఉప ఎన్నికతో రుజువైందని భూమా అన్నారు. కర్నూలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఉప ఎన్నికలు జరగనున్న 18 స్థానాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కమిటి సభ్యుడు భూమా నాగిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీడీపీలు 2,3 స్థానాలకు పాకులాడటం విడ్డూరంగా ఉందన్నారు. భవిష్యత్లో జగన్ సీఎం కావడం అనేది కోవూరు ఉప ఎన్నికతో రుజువైందని భూమా అన్నారు. కర్నూలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
0 comments:
Post a Comment