నేడు ‘తూర్పు’న జగన్ పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు ‘తూర్పు’న జగన్ పర్యటన

నేడు ‘తూర్పు’న జగన్ పర్యటన

Written By ysrcongress on Friday, March 2, 2012 | 3/02/2012

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో ఉన్న జగన్ గురువారం రాత్రి ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరి అర్ధరాత్రికి రాజమండ్రి చేరుకుంటారు. అక్కడ నుంచి కార్లో అమలాపురం చేరుకుని పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి నివాసంలో బస చేస్తారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు బయల్దేరి జగన్ కాట్రేని కోన మండలం పల్లం వెళతారు. అక్కడ అగ్నిప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించి.. వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా నాయకత్వం సమకూర్చిన సాయాన్ని పంపిణీ చేస్తారు.

తర్వాత అమలాపురం, అంబాజీపేట మీదుగా పి.గన్నవరం మండలం గంటిపెదపూడి వచ్చి.. కాలువలో స్కూల్ బస్సు పడిన ప్రాంతాన్ని పరిశీలించి బూరుగులంక వెళ్తారు. బస్సు దుర్ఘటనలో మృతి చెందిన అడ్డాల రోహిత్ కుటుంబాన్ని ఓదారుస్తారు. అక్కడ నుంచి గంటి పెదపూడి చేరుకొని మరో మృతురాలు చినమిల్లి బిందు మాధవి కుటుంబాన్ని ఓదారుస్తారు. అనంతరం ఈతకోట జంక్షన్, రావులపాలెం, మోరంపూడి జంక్షన్‌ల మీదుగా మధురపూడి చేరుకుని విమానంలో హైదరాబాద్ వెళతారు.
Share this article :

0 comments: