వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని అరెస్టు చేయాలని చూస్తే రాష్ర్టంలో ఏ ఒక్క జైలూ ఖాళీ ఉండదని ఆ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హెచ్చరించారు. ఆదివారం ఆయన ‘న్యూస్లైన్’తో మాట్లాడుతూ.. జగన్ అరెస్టుపై వస్తున్న పుకార్లను తీవ్రంగా ఖండించారు. జగన్ను అరెస్టు చేస్తారనే ఊహాగానాలతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం సృష్టించాలని అధికార, విపక్షాల నేతలు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్పై నమోదు చేసిన కుట్రపూరిత కేసుల్లో భూతద్దం పెట్టి వెతుకుతున్నా ఏ ఒక్క సాక్ష్యాన్నీ సీబీఐ సంపాదించలేకపోయిందన్నారు.
అయినప్పటికీ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ఆదేశాల మేరకు జగన్ను అరెస్టు చేయాలని ప్రయత్నిస్తే రాష్ర్టవ్యాప్తంగా జైల్భరో నిర్వహించేందుకు లక్షలాది మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. జగన్పై చేయి వేస్తే జైళ్లన్నీ వైఎస్సార్, జగన్ అభిమానులతో నిండిపోతాయన్నారు. తనకు వ్యతిరేకంగా పార్టీని స్థాపించారనే కక్షతోనే జగన్ను అరెస్టు చేయాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. అధికార, విపక్షాలతో పాటు కొన్ని పత్రికలు, చానళ్లు అదే పనిగా తమ నేతపై దుష్ర్పచారం చేస్తున్నాయన్నారు.
అయినప్పటికీ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ఆదేశాల మేరకు జగన్ను అరెస్టు చేయాలని ప్రయత్నిస్తే రాష్ర్టవ్యాప్తంగా జైల్భరో నిర్వహించేందుకు లక్షలాది మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. జగన్పై చేయి వేస్తే జైళ్లన్నీ వైఎస్సార్, జగన్ అభిమానులతో నిండిపోతాయన్నారు. తనకు వ్యతిరేకంగా పార్టీని స్థాపించారనే కక్షతోనే జగన్ను అరెస్టు చేయాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. అధికార, విపక్షాలతో పాటు కొన్ని పత్రికలు, చానళ్లు అదే పనిగా తమ నేతపై దుష్ర్పచారం చేస్తున్నాయన్నారు.
0 comments:
Post a Comment