హైదరాబాద్, న్యూస్లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తనకు మంచి మిత్రుడని, తామిద్దరమూ లోకసభ లో సహచరులుగా ఉన్నామని సమాజ్ వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ శాఖ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ చెప్పారు. యూపీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అనంతరం బుధవారం లక్నోలో ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దేశ శ్రేయస్సు కోసం యూపీఏ, ఎన్డీయేతర మూడో ఫ్రంటు రావాల్సిన అవసరముందని తెలిపారు. ఇందుకోసం తమవంతు ప్రయత్నాలు సాగిస్తామన్నారు. అయినప్పటికీ.. తృతీయ కూటమి ఏర్పాటుకు ఇంకా సమయముందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తనకు మంచి స్నేహితుడని, టీడీపీ అధినేత చంద్రబాబు తన తండ్రి ములాయం సింగ్ యాదవ్కు మిత్రుడని తెలిపారు. మూడో ఫ్రంటులో వీరిద్దరిలో ఎవరితో వెళ్తారని ప్రశ్నించగా.. ‘జగన్ నాకు కొలీగ్. ఆయనతో మంచి పరిచయమే ఉంది. అయితే వీరిద్దరిలో ఎవరితో వెళ్తామన్నది ఇప్పుడు చెప్పలేను. ఇద్దరితో మాకు స్నేహ సంబంధాలున్నాయి. ఇద్దరూ మిత్రులే’ అని వివరించారు.
ఆంధ్రప్రదేశ్లో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తనకు మంచి స్నేహితుడని, టీడీపీ అధినేత చంద్రబాబు తన తండ్రి ములాయం సింగ్ యాదవ్కు మిత్రుడని తెలిపారు. మూడో ఫ్రంటులో వీరిద్దరిలో ఎవరితో వెళ్తారని ప్రశ్నించగా.. ‘జగన్ నాకు కొలీగ్. ఆయనతో మంచి పరిచయమే ఉంది. అయితే వీరిద్దరిలో ఎవరితో వెళ్తామన్నది ఇప్పుడు చెప్పలేను. ఇద్దరితో మాకు స్నేహ సంబంధాలున్నాయి. ఇద్దరూ మిత్రులే’ అని వివరించారు.
0 comments:
Post a Comment