అంబానీ కుట్ర వల్ల వైఎస్సార్ చనిపోయారని వార్తలు వచ్చాయి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అంబానీ కుట్ర వల్ల వైఎస్సార్ చనిపోయారని వార్తలు వచ్చాయి

అంబానీ కుట్ర వల్ల వైఎస్సార్ చనిపోయారని వార్తలు వచ్చాయి

Written By ysrcongress on Thursday, March 8, 2012 | 3/08/2012

అంబానీల ప్రభావం ఎంతుందో చెప్పటానికే ఉదహరిస్తున్నా: కూనంనేని

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘అధ్యక్షా..! ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణం వెనుక కుట్ర ఉందని అప్పట్లో పత్రికల్లో వార్తలు వచ్చాయి. అది వాస్తవమా? అవాస్తవమా? అన్న చర్చలోకి నేను వెళ్లటం లేదు. అంబానీ కుట్ర వల్ల వైఎస్సార్ చనిపోయారని వార్తలు వచ్చాయి...’’ అని సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు శాసనసభలో పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలపై బుధవారం జరిగిన చ ర్చ సందర్భంగా ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి స్పందిస్తూ.. ఇప్పుడు ఈ అంశాన్ని ప్రస్తావించటం దారుణమని.. అనుమానాలు రేకెత్తించేలా మాట్లాడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. చీఫ్ విప్ తన వ్యాఖ్యలను ఆక్షేపించటాన్ని కూనంనేని తప్పుపట్టారు. ‘‘అంబానీ కుటుంబాల ప్రభావం అంత బలంగా ఉందని చెప్పటం నా ఉద్దేశం. ఆ ప్రమాదానికి అంబానీలే కారణమని నేను చెప్పలేదే? మీరు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? గ్యాస్ కేటాయింపులకు సంబంధించిన అంశం ఇది...’’ అని కూనంనేని ఎదురు దాడికి దిగారు. ‘‘గ్యాస్ మన బేసిన్‌లో ఉంటే అంబానీలు పెత్తనం చేస్తారా? ప్రభుత్వం చెల్లిస్తున్న ధర సరిపోలేదని గ్యాస్ సరఫరా నిలిపేస్తారా? మరి ఆయనపై ఎందుకు చర్య తీసుకోవటం లేదు? మనం అంబానీకి భయపడుతున్నామా?’’ అని తీవ్రస్థాయిలో ప్రశ్నించారు.
Share this article :

0 comments: