గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్రలో పాల్గొనేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు అభిమానులు, కార్యకర్తలు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఇప్పటి వరకు పలు విడతలుగా గుంటూరు జిల్లాలో 71 రోజుల పాటు 13 నియోజకవర్గాల్లో ఓదార్పు యాత్ర కొనసాగింది.
దివంగత వైఎస్ మరణం తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను ఓదార్చడంతోపాటు, మార్గమధ్యలోని గ్రామాల్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరిస్తూ యాత్ర నిర్వహిస్తున్నారు. గతేడాది అక్టోబరు 16న మంగళగిరి నియోజకవర్గం సీతానగరం నుంచి ప్రారంభమైన యాత్ర ఈ నెల 1న వినుకొండ నియోజకవర్గం వెల్లటూరు గ్రామంలో ముగిసింది.
దివంగత వైఎస్ మరణం తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను ఓదార్చడంతోపాటు, మార్గమధ్యలోని గ్రామాల్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరిస్తూ యాత్ర నిర్వహిస్తున్నారు. గతేడాది అక్టోబరు 16న మంగళగిరి నియోజకవర్గం సీతానగరం నుంచి ప్రారంభమైన యాత్ర ఈ నెల 1న వినుకొండ నియోజకవర్గం వెల్లటూరు గ్రామంలో ముగిసింది.
0 comments:
Post a Comment