'పల్లం' బాధితులకు వైఎస్సార్ పార్టీ వితరణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'పల్లం' బాధితులకు వైఎస్సార్ పార్టీ వితరణ

'పల్లం' బాధితులకు వైఎస్సార్ పార్టీ వితరణ

Written By news on Thursday, March 8, 2012 | 3/08/2012

 పల్లం అగ్ని ప్రమాద బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి సమకూర్చిన ఆర్థిక సాయం, కిట్లను రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే పిల్లి సుభాష్‌చంద్రబోస్ పంపిణీ చేశారు. 682 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5 వేలు నగదు, టంకుపెట్టె, చీర, పంచె, దుప్పటి, 5 కేజీల బియ్యం తదితర వస్తువులతో కూడిన కిట్లను ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్‌పార్టీ కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, గుత్తుల సాయి, పెండెం దొరబాబు, జక్కంపూడి విజయలక్ష్మి, కర్రి పాపారాయుడు, పీకే రావు, మోకా ఆనందసాగర్, మిండగుదిటి మోహన్, విత్తనాల వెంకటరమణ, వెంట్రు సుధీర్, పెమ్మాడి ప్రసాద్, పాలెపు ధర్మారావు, మట్ట శైలజా, వేగుళ్ల నీరజారాణి, సంసాని గంగాధరం, కె.నరేంద్ర రెడ్డి, కేవీ, తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: