జగన్ ఆస్తుల వ్యవహారంలో సీబీఐ హడావుడిగా చార్జిషీటు దాఖలు చేయడం వెనుక కాంగ్రెస్ పెద్దల హస్తం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సోమయాజులు ఆరోపించారు. చార్జిషీటు మోపడం ఓ రకంగా కోర్టు ధిక్కారం కిందకి వస్తుందని వివరించారు. ఎఫ్ఐఆర్ సంగతి తేలకుండా దర్యాప్తు జరపడం తనకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఇదే మొదటిసారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సీబీఐ దర్యాప్తు తీరు సవ్యంగా లేదని ఆయన విమర్శించారు.
జగన్ ఆస్తుల వ్యవహారంలో సీబీఐ శనివారం కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. రెండు ట్రంకు పెట్టెల్లో తరలించిన చార్జిషీటు పత్రాలను నాంపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానం ముందుంచింది. 68 పేజీల చార్జిషీటులో 13 మందిని నిందితులుగా, 66 మందిని సాక్షులుగా పేర్కొంటూ 263 డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించింది. మొదటి నిందితుడిగా జగన్, రెండో నిందితుడిగా విజయసాయిరెడ్డి పేర్లను పేర్కొంది. అరబిందో ఫార్మా, హెటిరో డ్రగ్స్, ట్రెడెంట్ టెక్నాలజీ, శ్రీనివాసరెడ్డి, నిత్యానందరెడ్డి, చంద్రశేఖర్, బీపీ ఆచార్య, విజయలక్ష్మి ప్రసాద్, చంద్రమౌళి, జగతి పబ్లికేషన్స్, జనని ఇన్ఫ్రా పేర్లను కూడా చార్జిషీటులో చేర్చింది.
జగన్ ఆస్తుల వ్యవహారంలో సీబీఐ శనివారం కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. రెండు ట్రంకు పెట్టెల్లో తరలించిన చార్జిషీటు పత్రాలను నాంపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానం ముందుంచింది. 68 పేజీల చార్జిషీటులో 13 మందిని నిందితులుగా, 66 మందిని సాక్షులుగా పేర్కొంటూ 263 డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించింది. మొదటి నిందితుడిగా జగన్, రెండో నిందితుడిగా విజయసాయిరెడ్డి పేర్లను పేర్కొంది. అరబిందో ఫార్మా, హెటిరో డ్రగ్స్, ట్రెడెంట్ టెక్నాలజీ, శ్రీనివాసరెడ్డి, నిత్యానందరెడ్డి, చంద్రశేఖర్, బీపీ ఆచార్య, విజయలక్ష్మి ప్రసాద్, చంద్రమౌళి, జగతి పబ్లికేషన్స్, జనని ఇన్ఫ్రా పేర్లను కూడా చార్జిషీటులో చేర్చింది.
0 comments:
Post a Comment