ముఖ్యమంత్రి ఎన్.కిరణ్కుమార్రెడ్డి వ్యవహారశైలి కారణంగా రానున్న రోజుల్లో రాష్ట్రం అంధకారమయం కానుందని వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ జనక్ ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఎడా పెడా విద్యుత్ కోతలతో ప్రజలు నరకం అనుభవిస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో దాదాపు 12 గంటల పాటు కోత విధిస్తున్నారన్నారు. అదే విధంగా వ్యవసాయరంగానికి సక్రమంగా 7 గంటలు కూడా అందడం లేదన్నారు. రాత్రి వేళల్లో కరెంట్ కోతతో విద్యార్థులు పరీక్షలకు సరిగా చదవలేకపోతున్నారని జనక్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సీఎం మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయని విమర్శించారు. ‘‘రాష్ట్రంలో 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నామంటున్నారు. ఏ విధంగా చేస్తారో చెప్పగలరా సీఎం గారు? కరెంట్ కోతలతో వ్యవసాయ రంగంతో పాటు పరిశ్రమ వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. వారానికి 4 రోజుల కరెంట్ కోతతో లక్షా 20వేల చిన్న పరిశ్రమల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో 20 లక్షల మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి తలెత్తింది. అంతేకాదు పరిశ్రమ యాజమాన్యాలు సకాలంలో బ్యాంకు వాయిదాలు చెల్లించలేకపోతున్నారు. రాష్ట్రంలో ఇంత గందరగోళం నెలకొన్న సీఎం మాత్రం తనకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు’’ అని జనక్ దుయ్యబట్టారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రభుత్వానికి ఆదాయం నిలిచిపోయి చివరకు ప్రజలు మరిన్ని ఇబ్బందులకు గురవుతారన్నారు. కరెంట్ విషయంలో దివంగత సీఎం వైఎస్ఆర్ చూపిన చొరవ, ప్రస్తుత సీఎం ఆసక్తి కనబర్చడంలేదన్నారు. 2004-09 మధ్య కాలంలో వైఎస్ విద్యుత్పై ఒక్క రూపాయి పెంచ కపోగా నాణ్యత విషయంలో ఏ రోజు రాజీపడలేదని గుర్తుచేశారు. కిరణ్ ఏడాది పాలనలో అడ్డుఅదుపు లేకుండా చార్జీలు పెంచుతున్నారన్నారని మండిపడ్డారు. గతంలో ఒక సారి చార్జీలు వడ్డించి రూ. 2వేల కోట్లు దండుకున్న కిరణ్, మరో సారి ప్రజల నెత్తిన రూ.4వేల కోట్లు మోపేందుకు రంగం సిద్దం చేస్తున్నారని దుయ్యబట్టారు. రిలయన్స్ను అడిగే దమ్ములేదా? రాష్ట్రంలో కరెంట్ కొరతకు కారణమైన రిలయన్స్ సంస్థను నిలదీసే దమ్ము, ధైర్యం సీఎం కిరణ్కు లేవా? అని జనక్ ప్రసాద్ నిలదీశారు. కేజీ బేసిన్ ద్వారా ఒప్పందం ప్రకారం రిలయన్స్ సంస్థ గ్యాస్ అందించకపోవడం వల్లే రాష్ట్రంలో అంధకారం నెలకొందని వివరించారు. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆసంస్థ 2400 మెగావాట్లకు గ్యాస్ అందిచాల్సి ఉన్న, కేవలం 1500 మెగావాట్లకే పరితంచేసినప్పటికీ సీఎం కిరణ్ పల్లెత్తు మాట అనడంలేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నా నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీలు వ్యవహారశైలి కారణంగానే ఉప ఎన్నికల్లో ఆరెండు పార్టీలకు ఒక్క సీటు దక్కలేదని జనక్ స్పష్టం చేశారు. |
Home »
» రిలయన్స్ను అడిగే దమ్ములేదా?
రిలయన్స్ను అడిగే దమ్ములేదా?
Written By ysrcongress on Saturday, March 24, 2012 | 3/24/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment