అతిపెద్ద ప్రభుత్వ రంగ రవాణా సంస్థ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేందుకు తెర వెనక సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. సోమవారం అసెంబ్లీ లాబీలో విలేకర్లతో చిట్ చాట్ చేసిన రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కొన్ని రూట్లలో ప్రైవేటీకరణ తప్పదని సూచనప్రాయంగా వెల్లడించారు. ఈ ప్రైవేటీకరణ అనేది కేవలం కొన్ని ప్రాంతాల్లోనే జరుగుతుందన్నారు. ఆర్టీసీ బస్సులు నడవని గ్రామీణ ప్రాంతాలను గుర్తించి అక్కడ మాత్రమే ప్రైవేట్ ఆపరేటర్లు బస్సులు నడిపేందుకు అనుమతి ఇస్తామని మంత్రి బొత్స తెలిపారు.
అలాగే, ఆర్టీసీని జోన్ల వారీగా పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం నిర్ధిష్ట లక్ష్యాలను నిర్ణయించుకుని ముందుకు సాగుతామని ఆయన చెప్పారు. పండగ రద్దీ సమయాల్లో కొన్ని రూట్లలో అధిక ప్రయాణ ఛార్జీలను వసూలు చేయకుండా తగిన చర్యలు తీసుకుంటామని బొత్స హామీ ఇచ్చారు. కాగా బొత్స ప్రకటనపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించాయి.
అలాగే, ఆర్టీసీని జోన్ల వారీగా పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం నిర్ధిష్ట లక్ష్యాలను నిర్ణయించుకుని ముందుకు సాగుతామని ఆయన చెప్పారు. పండగ రద్దీ సమయాల్లో కొన్ని రూట్లలో అధిక ప్రయాణ ఛార్జీలను వసూలు చేయకుండా తగిన చర్యలు తీసుకుంటామని బొత్స హామీ ఇచ్చారు. కాగా బొత్స ప్రకటనపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించాయి.
0 comments:
Post a Comment