'వైఎస్ కుటుంబీకులే లక్ష్యంగా సీబీఐ దర్యాప్తు' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'వైఎస్ కుటుంబీకులే లక్ష్యంగా సీబీఐ దర్యాప్తు'

'వైఎస్ కుటుంబీకులే లక్ష్యంగా సీబీఐ దర్యాప్తు'

Written By ysrcongress on Friday, March 2, 2012 | 3/02/2012

ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం మూలాల్లోకి సీబీఐ అసలు వెళ్లడం లేదనీ ఎంత సేపూ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని ఇరికించి అరెస్టు చేయాలన్న ఉద్దేశ్యంతోనే దర్యాప్తును సాగిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ఆమె శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం 2000 సంవత్సరంలోనే ఎన్.చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడే వేళ్లూనుకుందనీ కానీ సీబీఐ మాత్రం ఆ దిశగా తమ దృష్టిని సారిండచం లేదని ధ్వజమెత్తారు. 

2000 సంవత్సరంలో హైదరాబాద్‌లో దుబాయ్ కంపెనీల ప్రతినిధులతో జరిగిన ఒక సదస్సులోనే ఎమ్మార్ సంస్థను రాష్ట్రంలోకి తీసుకు రావడానికి అవగాహన కుదిరిందనీ బాబు ప్రోత్సాహంతోనే ఆ కంపెనీ ఇక్కడ రియల్ ఎస్టేట్ కార్యకలాపాలకు అంకురార్పణ చేసేందుకు ఉపక్రమించారని పద్మ వివరించారు. గోల్ఫ్‌కోర్సు, హోటల్, కన్వెన్షన్ సెంటర్ నిర్మించడానికి తొలుత బాబు ప్రభుత్వం 250 ఎకరాలను ఎమ్మార్‌కు ధారాదత్తం చేసిందనీ ఆ తరువాత బాబుకు విల్లాల నిర్మాణంపై గల మోజుతో ఎవరి ప్రతిపాదనలు గానీ, సిఫార్సులు గానీ లేకుండా మరో 250 ఎకరాలు కేవలం ఒక నోట్‌ఫైల్‌పై సంతకం ద్వారా ఒక నోటి మాట ద్వారా కేటాయించారని ఆమె వివరించారు. 

ఎమ్మార్ కంపెనీ ప్రతినిధులు కూడా అడక్కుండానే మంత్రివర్గం ఆమోదం లేకుండానే, అధికారులెవ్వరూ ప్రతిపాదనలు చేయకుండా చంద్రబాబు 250 ఎకరాలు అదనంగా కేటాయించాలని ఎందుకు నోట్‌ఫైలు రాసి ఆమోదం తెలిపారని ఆమె ప్రశ్నించారు. ఎమ్మార్ ప్రతినిధి కోనేరు రాజేంద్రప్రసాద్‌కు మేలు చేయాలనే ఉద్దేశ్యంతోనే బాబు ఇలా చేశారని ఆమె అన్నారు. సీబీఐ వారికి ఈ ఉల్లంఘన ఎందుకు కనిపించలేదు? నోట్‌ఫైల్‌పై రాయడం ద్వారా 250 ఎకరాల భూమిని ఈ సంస్థకు ధారాదత్తం చేశారని కొన్ని పత్రికలు వెలుగులోకి తెచ్చే వరకూ తెలుసుకోలేని దుస్థితిలో సీబీఐ ఉందా? అని ఆమె ప్రశ్నించారు. 

అసలు సీబీఐకి చంద్రబాబుకు ఉన్న బంధం ఏమిటనే అంశం జోలికి సీబీఐ ఎందుకు పోవడం లేదని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. పైగా ఈ విషయంలో 2001 నుంచీ దర్యాప్తు చేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు నిస్సిగ్గుగా వివరణ ఇచ్చిందని పద్మ విమర్శించారు. నిజంగా మీరు పరిశోధించి ఉంటే 2000 సంవత్సరంలో చేసుకున్న ఒప్పందం వెనుక చోటు చేసుకున్న నిజాలేమిటనేది నిగ్గు తేల్చారా? అని ఆమె నిలదీశారు. సీబీఐ అసలు ఏ అంశం మూలాల్లోకి వెళ్లడం లేదనడానికి ఇంతకంటే ఉదాహరణ, నిదర్శనం, తార్కాణం ఏంకావాలని ఆమె అన్నారు. నోట్‌ఫైల్ ద్వారా 250 ఎకరాలు ఎమ్మార్‌కు కేటాయించిన విషయంపై చంద్రబాబు నోరు విప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఏమాశించి ఈ నిర్ణయం తీసుకున్నారో ఆయన చెప్పి తీరాలని ఆమె డిమాండ్ చేశారు. నిబంధనలను ఉల్లంఘించి అవకతవకలకు పాల్పడిన చంద్రబాబే కాలర్ ఎత్తుకుని అసెంబ్లీలో అందరినీ అవినీతి పరులుగా నిందిస్తూ ఉంటే ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని పద్మ వ్యాఖ్యానించారు. 

బాబు వైఖరి దొంగే...దొంగ...దొంగ అని అరిచినట్లుగా ఉందని ఆమె పేర్కొన్నారు. అసలు ఎమ్మార్‌కు టెండర్లు కట్టబెట్టిన తీరే అనుమానాలకు తావిస్తున్నదని గతంలో కూడా చెప్పామన్నారు. ఐదు కంపెనీలు పోటీ పడితే ప్రభుత్వమే రెండింటిని తిర్కరించిందనీ మిగిలిన మూడింటి నుంచి కూడా వ్యూహాత్మకంగా వెనక్కితగ్గేలా చేశారన్నారు. గ్లోబల్ టెండర్లలో ఒక కంపెనీయే ఉన్నపుడు రద్దు చేసి తాజా టెండర్లను ఎందుకు పిలవలేదనే విషయం సీబీఐకి పట్టదా? అని ఆమె అన్నారు. ఎమ్మార్ కుంభకోణం మూలాలను వదలి వేసి విల్లాలు అమ్మిన సొమ్ము సాక్షిలోకి ఏమైనా వెళ్లిందా అని అనుమానిస్తూ వై.ఎస్.ఆర్ కుటుంబీకులను ఇందులో ఇరికించి అరెస్టు చేయాలని చూస్తున్నారని ఆమె అన్నారు.
Share this article :

0 comments: